తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల కిందట చికెన్ ధరలు 50 రూపాయల దిగువకు పడిపోయాయి. కరోనా వచ్చిన కొత్తలో చికెన్ తింటేనే ఆ వైరస్ సోకుతుందన్న ప్రచారం గట్టిగా సాగింది. దీంతో జనాలు చికెన్ సెంటర్ల వైపు చూడటమే మానేశారు. సప్లై భారీగా ఉండగా.. సరఫరా తగ్గిపోవడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని చోట్ల కిలో 30-40 రూపాయలకు కూడా ఇచ్చారు. అయినా కూడా జనాలు చికెన్ కొనని పరిస్థితి కనిపించింది.
ఐతే చికెన్ వల్ల కరోనా రాదనే విషయాన్ని గట్టిగా ప్రచారం చేయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడంతో జనాల్లో మార్పు వచ్చింది. నెమ్మదిగా అందరూ చికెన్కు తిరిగి అలవాటు పడ్డారు. దీంతో క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కిలో రూ.300 పలికే పరిస్థితి వచ్చింది.
గత వారం హైదరాబాద్లో చికెన్ ధర రూ.230-240 మధ్య ఉండగా.. ఈ ఆదివారానికి అది ఏకంగా రూ.300 మార్కును టచ్ చేసింది. పేపర్ ధరే రూ.290కి చేరిపోయింది. ఇది ఆల్ టైం హై రికార్డు కావడం గమనార్హం. ఒకప్పుడు రూ.250 రికార్డు ధర. దాని మీద ఈసారి 50 పెరిగిపోయింది. మరీ ఈ స్థాయిలో చికెన్ ధరలు పెరిగిపోవడం అనూహ్యం.
ఇందుకు కారణం చికెన్ సప్లై తగ్గిపోవడమే. పౌల్ట్రీ ఫామ్స్లో చికెన్ పెంపకానికి 45 రోజుల నుంచి 60 రోజుల దాకా పడుతుంది. ఐతే రెండు నెలల కిందట ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఫామ్స్లో చికెన్ పెంపకాలు బాగా తగ్గించేశారు. సగానికి సగం ఉత్పత్పి పడిపోయింది. ఇప్పుడు జనాలు లాక్ డౌన్ టైంలో విపరీతంగా నాన్ వెజ్ తింటున్నారు.
కోడి మాంసం విషయంలో సందేహాలన్నీ తొలగిపోవడంతో చికెన్ సెంటర్ల మీద పడుతున్నారు. డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గ సప్లై లేదు. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. ఇవి ఇంకా ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…