తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న షర్మిల పార్టీకి సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెల (జులై) 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. షర్మిల పెట్టే పార్టీ పేరును ఇటీవలే ప్రకటించటం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. పొట్టిగా చెప్పాలంటే వైఎస్సార్ టీపీగా డిసైడ్ చేసి.. ఆ పేరు మీదన ఈసీలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.
ఏపీలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరు ఉండటం.. దానిలో తెలంగాణ ఒక్కటి మాత్రమే యాడ్ అయ్యింది. దీంతో.. ఒక పార్టీని పోలినట్లుగా మరో పార్టీ పేరు ఉండటంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.. తన కుమార్తె తెలంగాణలో పెట్టే పార్టీకి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ ఈసీకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30న కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో.. ఈసీ నుంచి పార్టీ అనుమతుల ప్రక్రియ పూర్తి అయినట్లుగా షర్మిల వర్గం భావిస్తోంది. షర్మిల పెడుతున్న పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టేబుల్ ఫ్యాన్ గుర్తును కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడలేదు. ఇదెంత వరకు నిజమన్నది ఈసీ స్వయంగా ప్రకటిస్తేనే స్పష్టత వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…