Political News

షర్మిల పార్టీకి టేబుల్ ఫ్యాన్?

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న షర్మిల పార్టీకి సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెల (జులై) 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. షర్మిల పెట్టే పార్టీ పేరును ఇటీవలే ప్రకటించటం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. పొట్టిగా చెప్పాలంటే వైఎస్సార్ టీపీగా డిసైడ్ చేసి.. ఆ పేరు మీదన ఈసీలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.

ఏపీలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరు ఉండటం.. దానిలో తెలంగాణ ఒక్కటి మాత్రమే యాడ్ అయ్యింది. దీంతో.. ఒక పార్టీని పోలినట్లుగా మరో పార్టీ పేరు ఉండటంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.. తన కుమార్తె తెలంగాణలో పెట్టే పార్టీకి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ ఈసీకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30న కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో.. ఈసీ నుంచి పార్టీ అనుమతుల ప్రక్రియ పూర్తి అయినట్లుగా షర్మిల వర్గం భావిస్తోంది. షర్మిల పెడుతున్న పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టేబుల్ ఫ్యాన్ గుర్తును కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడలేదు. ఇదెంత వరకు నిజమన్నది ఈసీ స్వయంగా ప్రకటిస్తేనే స్పష్టత వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.

This post was last modified on June 8, 2021 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 hour ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

7 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago