Political News

సీఐడీ అధికారులకు షాకిచ్చిన రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు… ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కి ఎంపీ రఘురామ లీగల్ నోటీసులు పంపారు. త‌న‌ అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని రఘురామ తెలిపారు.

త‌న మొబైల్‌ కోడ్‌ ఓపెన్‌ చేయాలని కస్టడీలో హింసించారని అని లీగల్‌ నోటీసులో పేర్కొన్న‌ రఘురామ… ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందన్నారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు సీఐడీ అధికారుల‌ను హెచ్చరించారు.

కాగా.. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును గత నెలలో ఏపీ సిఐడి హైదరాబాదులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబదు నుంచి రఘురామ కృష్ణంరాజును గుంటూరు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చుతూ కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. అయితే, రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మీద విడుదలైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స జరిగిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లారు.

This post was last modified on June 6, 2021 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

18 minutes ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

1 hour ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

2 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

4 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago