Political News

బీజేపీలోకి ఈట‌ల‌… టీఆర్ఎస్ నేత‌ల‌ కంటే ఎక్కువ ఫీల‌వుతోంది వీరే

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఎపిసోడ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేత‌లు స్పందించారు. అయితే, వాళ్ల కంటే ఎక్కువ‌గా వామ‌ప‌క్షాల నేత‌లు ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు. వారు రియాక్ట్ అవుతున్న తీరు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు.

త‌నది క‌మ్యూనిస్టు డీఎన్ఏ అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఒత్తిడి మేర‌కు బీజేపీ చేరుతున్నాన‌ని మీడియా చిట్‌చాట్‌లో ఈటెల రాజేంద‌ర్ వెల్ల‌డించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో క‌మ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశంలోనే ప‌నిచేస్తున్నాయంటూ ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ పచ్చి అవకాశవాది అని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మతోన్మాద బీజేపీలో చేరుతూ సీబీఐ మీద నింద‌లు వేస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసైన్డ్‌ భూములు ఎవరు కొన్నా త‌ప్పేన‌ని పేర్కొంటూ ఈట‌ల రాజేంద‌ర్ వెంటనే ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాల‌ని డిమాండ్ చేశారు.

ఇక మ‌రో వామ‌ప‌క్ష పార్టీ అయిన సీపీఎం సైతం ఈట‌ల ఎపిసోడ్‌పై స్పందించింది. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం అని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం మండిప‌డ్డారు. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం అభ్యంతరకరమ‌న్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే తెలంగాణ ప్రజల లౌకిక వారసత్వాన్ని గౌరవించినవారవుతారని హిత‌వు ప‌లికారు.

This post was last modified on June 5, 2021 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

19 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago