Political News

జగన్ దే వైఎస్సార్సీపీ

వైఎస్సార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిదే అని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పార్టీ పేరుతో కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ పేరును జగన్ అక్రమంగా వాడుకుంటున్నట్లు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాష కోర్టులో కేసు వేశారు. వెంటనే పార్టీపై తనదే అధికారమని తేల్చి చెప్పాలంటు భాష కోర్టులో వాదించారు.

ఇదే సందర్భంగా వైఎస్సార్సీపీకి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు కూడా కేసులు వేలుపెట్టారు. నిజానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మహబూబ్ భాషకు మద్దతుగా కృష్ణంరాజు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేశారు. భాష కేసు వేసినపుడు పెద్దగా పట్టించుకోకపోయినా తిరుగుబాటు ఎంపి ఫిర్యాదు చేయటంతో వివాదం మరింతగా ముదిరింది.

నిజానికి భాషా ఫిర్యాదులో పసలేదని అందరి తెలుసు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర భాష రిజిస్టర్ చేసుకున్న పార్టీ పేరు అన్న వైఎస్సీర్సీపీ. జగన్ రిజిస్టర్ చేసిన పార్టీ పేరు వైఎస్సార్సీపీ. అంటే జగన్ రిజిస్టర్ చేసిన పార్టీకి ముందు అన్న అన్న పేరులేదు. ఈ విషయం తెలిసినా తిరుగుబాటు ఎంపి కమీషన్ కు ఫిర్యాదు చేయటం విచిత్రం. పైగా ఇదే పార్టీ గుర్తుపై రఘురామ పోటీ చేసి గెలిచారు.

సరే వివాదాలు రేకెత్తించటమే అందరికీ కావాల్సింది కాబట్టి పార్టీ పేరుపైన కూడా ఇంతకాలం వివాదం నడిచింది. రెండు వైపుల వాదనలు వినటంతో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి హైకోర్టు అభిప్రాయం తీసుకుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత వైఎస్సార్సీపీకి భాషాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేసింది. దాంతో జగన్ కే వైఎస్సార్సీపీ సొంతమని తేలిపోయింది.

This post was last modified on June 5, 2021 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

1 hour ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

3 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

3 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

4 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

5 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

6 hours ago