వైఎస్సార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిదే అని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పార్టీ పేరుతో కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ పేరును జగన్ అక్రమంగా వాడుకుంటున్నట్లు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాష కోర్టులో కేసు వేశారు. వెంటనే పార్టీపై తనదే అధికారమని తేల్చి చెప్పాలంటు భాష కోర్టులో వాదించారు.
ఇదే సందర్భంగా వైఎస్సార్సీపీకి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు కూడా కేసులు వేలుపెట్టారు. నిజానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మహబూబ్ భాషకు మద్దతుగా కృష్ణంరాజు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేశారు. భాష కేసు వేసినపుడు పెద్దగా పట్టించుకోకపోయినా తిరుగుబాటు ఎంపి ఫిర్యాదు చేయటంతో వివాదం మరింతగా ముదిరింది.
నిజానికి భాషా ఫిర్యాదులో పసలేదని అందరి తెలుసు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర భాష రిజిస్టర్ చేసుకున్న పార్టీ పేరు అన్న వైఎస్సీర్సీపీ. జగన్ రిజిస్టర్ చేసిన పార్టీ పేరు వైఎస్సార్సీపీ. అంటే జగన్ రిజిస్టర్ చేసిన పార్టీకి ముందు అన్న అన్న పేరులేదు. ఈ విషయం తెలిసినా తిరుగుబాటు ఎంపి కమీషన్ కు ఫిర్యాదు చేయటం విచిత్రం. పైగా ఇదే పార్టీ గుర్తుపై రఘురామ పోటీ చేసి గెలిచారు.
సరే వివాదాలు రేకెత్తించటమే అందరికీ కావాల్సింది కాబట్టి పార్టీ పేరుపైన కూడా ఇంతకాలం వివాదం నడిచింది. రెండు వైపుల వాదనలు వినటంతో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి హైకోర్టు అభిప్రాయం తీసుకుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత వైఎస్సార్సీపీకి భాషాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేసింది. దాంతో జగన్ కే వైఎస్సార్సీపీ సొంతమని తేలిపోయింది.
This post was last modified on June 5, 2021 10:08 am
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…