తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి టీఆర్ఎస్ తో అనుబంధం తెగిపోయింది. ప్రస్తుతం ఆయన బీజేపీతో తన కొత్త అధ్యయనాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ని వీడి.. బీజేపీలోకి అడుగుపెడుతున్న ఆయనకి.. గతాన్ని గుర్తుచేస్తూ.. నెట్టింట గులాబీ అభిమానులు ఎటాక్ చేస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవితోపాటు… టీఆర్ఎస్ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సమయంలో… ఈటల.. సీఎం కేసీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ లను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. అయితే.. అలా కేసీఆర్ పై విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే… ఈటలను నెట్టింట టార్గెట్ చేశారు. గతంలో.. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ లకు మద్దుతుగా.. బీజేపీ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
‘ కేసీఆర్.. ముదిరాజ్ ల తల్లిపాలు తాగి పెరిగారు. ఆ ప్రేమతోనే ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకూ ఓ కేసీఆర్ ఉంటే బాగుండని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుంది’ అంటూ గతంలో ఈటల మాట్లాడిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తుండటం గమనార్హం.
ఇక ఎంపీ సంతోష్ కుమార్ పై కూడా ప్రశంసలు కురిపించిన వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలను షేర్ చేస్తూ.. ఇవి మీరు చెప్పిన మాటలే ఈటల సార్.. మరి వీటికి సమాధానమేంది..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియోలకు ఈటల కౌంటర్ ఎటాక్ ఇస్తారా.. లేదా.. స్తబ్దుగా ఉండిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on June 5, 2021 9:14 am
ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఇక అందులోనూ చాలా అరుదుగా పర్సనల్ ప్రొఫైల్ మార్పులు కనిపిస్తుంటాయి. దాదాపు…
అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
టాలీవుడ్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉందంటే ఒక ఏడాది ముందే సంక్రాంతి రిలీజులకు సిద్ధమయ్యేంత. ఈ విషయంలో అనిల్ రావిపూడి…
2027 సంక్రాంతికి వస్తాయని చాలా సినిమాల లిస్టుగా బయటికి కనిపిస్తోంది కానీ డేట్ తో సహా వేసినవాళ్లు ఎవరూ లేకపోగా…
పార్టీ ఒకటే కానీ.. అంతర్గత కూటములు చాలానే ఉన్నాయి. ఆ నియోజకవర్గం స్పెషల్ అదే. ఇతర నియోజక వర్గాల్లోనూ నాయకుల…
వైసీపీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలను మంత్రులు అస్సలు ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా వెనుకాడవద్దని ఆయన…