Political News

ఈటలపై విమర్శలు.. పల్లా మాటల ఆంత్యరం అదేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసే క్రమంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరో ఏదో చెప్పారని.. రాత్రికి రాత్రే తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఇష్టం లేక తాను పార్టీని వీడుతున్నట్లు కూడా చెప్పారు.

అయితే.. అలా ఈటల రాజీనామా ప్రకటించాడో లేదో.. ఇలా టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. నిజంగా ఈటలకు ఆత్మగౌరవమే ఉంటే.. పేదల ఆస్తులను లాక్కోరని పల్లా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది నాయకులను కేసీఆర్ నాయకులుగా చేశారని పేర్కొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈటల బీజేపీలో చేరటానికి కారణం ఇదేనంటూ పల్లా చెప్పిన మాటలే ఇప్పుడు దుమారం రేపేలా కనపడుతున్నాయి. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారనేది పల్లా అభిప్రాయం. అదే నిజం అని కాసేపు అనుకుంటే.. అక్రమాస్తులు ఉన్నవారంతా బీజేపీలో చేరితే..వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరా అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది.

నిజంగా ఈటల చేసింది తప్పే అయితే.. దానిపై చర్యలు తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది కదా..? బీజేపీలో చేరాడు కదా.. అని వారి జోలికి వెళ్లరా..? ఇదెక్కడి వాదన అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.

ప్రతిపక్షంలోని నేతలు ఎవరైనా అలా మాట్లాడి ఉంటే అర్థం మరోలా ఉండేది.. కానీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకుడే ఇలా మాట్లాడటంతో అందరికీ అనుమానాలు మొదలౌతున్నాయి. మరి పల్లా మాటల వెనక అసలు ఆంతర్యం ఏమిటో..?

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

58 minutes ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

1 hour ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

2 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

3 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

3 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

4 hours ago