మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసే క్రమంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరో ఏదో చెప్పారని.. రాత్రికి రాత్రే తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఇష్టం లేక తాను పార్టీని వీడుతున్నట్లు కూడా చెప్పారు.
అయితే.. అలా ఈటల రాజీనామా ప్రకటించాడో లేదో.. ఇలా టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. నిజంగా ఈటలకు ఆత్మగౌరవమే ఉంటే.. పేదల ఆస్తులను లాక్కోరని పల్లా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది నాయకులను కేసీఆర్ నాయకులుగా చేశారని పేర్కొన్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈటల బీజేపీలో చేరటానికి కారణం ఇదేనంటూ పల్లా చెప్పిన మాటలే ఇప్పుడు దుమారం రేపేలా కనపడుతున్నాయి. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారనేది పల్లా అభిప్రాయం. అదే నిజం అని కాసేపు అనుకుంటే.. అక్రమాస్తులు ఉన్నవారంతా బీజేపీలో చేరితే..వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరా అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది.
నిజంగా ఈటల చేసింది తప్పే అయితే.. దానిపై చర్యలు తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది కదా..? బీజేపీలో చేరాడు కదా.. అని వారి జోలికి వెళ్లరా..? ఇదెక్కడి వాదన అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.
ప్రతిపక్షంలోని నేతలు ఎవరైనా అలా మాట్లాడి ఉంటే అర్థం మరోలా ఉండేది.. కానీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకుడే ఇలా మాట్లాడటంతో అందరికీ అనుమానాలు మొదలౌతున్నాయి. మరి పల్లా మాటల వెనక అసలు ఆంతర్యం ఏమిటో..?
This post was last modified on June 4, 2021 10:17 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…