Political News

అమూల్‌పై ఖ‌ర్చు పెట్టొద్దు.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు బ్రేకులు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఎంతో ఇష్టంగా.. మ‌రెంతో ప్రేమ‌గా రాష్ట్రంలో విస్త‌రిస్తున్న గుజ‌రాత్‌కు చెందిన పాల డెయిరీ సంస్థ ‘అమూల్’ విష‌యంలో హైకోర్టు బ్రేకులు వేసింది. అది కూడా అమూల్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విస్త‌రిస్తూ.. జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన శుక్ర‌వార‌మే.. హైకోర్టు ఈ డెయిరీ విష‌యంలో సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇదీ..

అమూల్‌ డెయిరీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమూల్‌, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. అదేస‌మయంలో అస‌లు.. ‘విజ‌య’ డెయిరీ ఉండ‌గా.. అమూల్‌ను తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏంట‌ని.. న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.

అయితే.. అమూల్‌కు సంబంధించి.. ప్ర‌భుత్వం స‌మ‌ర్ధించుకునేలా దాఖ‌లు చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్‌.. న్యాయ‌స్థానానికి చేర‌క‌పోవ‌డంతో కోర్టు.. ఈ విచార‌ణ‌ను వాయిదా వేసింది. అప్ప‌టి వ‌ర‌కు అమూల్ విస్త‌ర‌ణ‌, లేదా అమూల్ స్థాప‌న‌ల పేరుతో ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌రాదంటూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ ఈ రోజే.. అమూల్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విస్త‌రించారు.

సీఎం జ‌గ‌న్ వ్యూహం ఇదీ..

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అమూల్ ద్వారా పాల సేకరణను మరింత విస్తరించి, పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 2600 గ్రామాల్లో విస్తరిస్తామని, దశలవారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్ను విస్తరిస్తామని తెలిపారు. అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు. అమూల్కు పాలు పోయడం లాభదాయకమన్న సీఎం… పాడి రైతులకు లీటర్ కు 5 నుంచి 15 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు.

పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న సీఎం.. రాబోయే 2 సంవత్సరాల్లో అక్షరాల 4వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పాల నాణ్యత తెలుసుకునే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఇలాంటి ఖ‌ర్చుల‌కు ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on June 4, 2021 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago