అనూహ్య ఘటన ఒకటి టాంజానియా పార్లమెంటులో చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక మహిళా ఎంపీ ధరించిన దస్తులు సరిగా లేవన్న అభిప్రాయానికి వచ్చిన పార్లమెంటు ఆమెను సభ నుంచి బహిష్కరించిన షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వేసుకునే దుస్తుల్ని వేరేలా ఎందుకు చూస్తారు? లాంటి మాటలు మన దగ్గర చాలానే వినిపిస్తాయి. కానీ.. ఆ దేశంలో మాత్రం అలాంటివేమీ వినిపించలేదని చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
టాంజానియా పార్లమెంటులో మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే ఒకరు. మిగిలిన మహిళా ఎంపీలతో పోల్చినప్పుడు ఆమె టైట్ జీన్సు వేసుకున్నారు. ఎల్లో కలర్ టాప్ వేసుకున్నారు. చూసేందుకు ఇబ్బందికరంగా.. ఆ మాటకు వస్తే అశ్లీలత ఉట్టిపడేలా లేదు. కాకుంటే.. ఒక కార్పొరేట్ మహిళా ఉన్నత ఉద్యోగి మాదిరి రెఢీ అయి వచ్చారు. ఆమె డ్రెస్సింగ్ మీద మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన స్పీకర్ చర్యలకు రెఢీ అయ్యారు. బిగుతైన దుస్తులు ధరించి పార్లమెంటుకు సమావేశానికి హాజరైన సిచ్వాలేను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి దుస్తులు ధరించాలని హితబోధ చేయటం గమనార్హం. దీంతో.. సదరు ఎంపీ ఏమీ మాట్లాడకుండా సభ నుంచి బయటకు వచ్చేశారు. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినప్పటికి.. తాజాగా వచ్చిన ఫిర్యాదుపై తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుందని.. అందుకే ఆమెను సభ నుంచి బయటకు పంపేశారు. ఇకపై వచ్చే సభ్యులంతా జాగ్రత్తగా డ్రెస్ కావాలని కోరారు.
టాంజానియా పార్లమెంట్ నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు టైట్ జీన్సు వేసుకురావటం నిబంధనలకు విరుద్ధమని మిగిలిన వారు చెబుతున్నారు. కొందరు మహిళా ఎంపీలు రూల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా.. తమకు నచ్చిన దుస్తుల్లో వచ్చారు. అందుకు భిన్నంగా అనూహ్య చర్య తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఆమె వేసుకున్న దుస్తులకు అంత కఠిన చర్య తీసుకోవాల్సి ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on June 4, 2021 9:22 am
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…