అనూహ్య ఘటన ఒకటి టాంజానియా పార్లమెంటులో చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక మహిళా ఎంపీ ధరించిన దస్తులు సరిగా లేవన్న అభిప్రాయానికి వచ్చిన పార్లమెంటు ఆమెను సభ నుంచి బహిష్కరించిన షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వేసుకునే దుస్తుల్ని వేరేలా ఎందుకు చూస్తారు? లాంటి మాటలు మన దగ్గర చాలానే వినిపిస్తాయి. కానీ.. ఆ దేశంలో మాత్రం అలాంటివేమీ వినిపించలేదని చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
టాంజానియా పార్లమెంటులో మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే ఒకరు. మిగిలిన మహిళా ఎంపీలతో పోల్చినప్పుడు ఆమె టైట్ జీన్సు వేసుకున్నారు. ఎల్లో కలర్ టాప్ వేసుకున్నారు. చూసేందుకు ఇబ్బందికరంగా.. ఆ మాటకు వస్తే అశ్లీలత ఉట్టిపడేలా లేదు. కాకుంటే.. ఒక కార్పొరేట్ మహిళా ఉన్నత ఉద్యోగి మాదిరి రెఢీ అయి వచ్చారు. ఆమె డ్రెస్సింగ్ మీద మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన స్పీకర్ చర్యలకు రెఢీ అయ్యారు. బిగుతైన దుస్తులు ధరించి పార్లమెంటుకు సమావేశానికి హాజరైన సిచ్వాలేను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి దుస్తులు ధరించాలని హితబోధ చేయటం గమనార్హం. దీంతో.. సదరు ఎంపీ ఏమీ మాట్లాడకుండా సభ నుంచి బయటకు వచ్చేశారు. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినప్పటికి.. తాజాగా వచ్చిన ఫిర్యాదుపై తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుందని.. అందుకే ఆమెను సభ నుంచి బయటకు పంపేశారు. ఇకపై వచ్చే సభ్యులంతా జాగ్రత్తగా డ్రెస్ కావాలని కోరారు.
టాంజానియా పార్లమెంట్ నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు టైట్ జీన్సు వేసుకురావటం నిబంధనలకు విరుద్ధమని మిగిలిన వారు చెబుతున్నారు. కొందరు మహిళా ఎంపీలు రూల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా.. తమకు నచ్చిన దుస్తుల్లో వచ్చారు. అందుకు భిన్నంగా అనూహ్య చర్య తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఆమె వేసుకున్న దుస్తులకు అంత కఠిన చర్య తీసుకోవాల్సి ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on June 4, 2021 9:22 am
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…