అనూహ్య ఘటన ఒకటి టాంజానియా పార్లమెంటులో చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక మహిళా ఎంపీ ధరించిన దస్తులు సరిగా లేవన్న అభిప్రాయానికి వచ్చిన పార్లమెంటు ఆమెను సభ నుంచి బహిష్కరించిన షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వేసుకునే దుస్తుల్ని వేరేలా ఎందుకు చూస్తారు? లాంటి మాటలు మన దగ్గర చాలానే వినిపిస్తాయి. కానీ.. ఆ దేశంలో మాత్రం అలాంటివేమీ వినిపించలేదని చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
టాంజానియా పార్లమెంటులో మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే ఒకరు. మిగిలిన మహిళా ఎంపీలతో పోల్చినప్పుడు ఆమె టైట్ జీన్సు వేసుకున్నారు. ఎల్లో కలర్ టాప్ వేసుకున్నారు. చూసేందుకు ఇబ్బందికరంగా.. ఆ మాటకు వస్తే అశ్లీలత ఉట్టిపడేలా లేదు. కాకుంటే.. ఒక కార్పొరేట్ మహిళా ఉన్నత ఉద్యోగి మాదిరి రెఢీ అయి వచ్చారు. ఆమె డ్రెస్సింగ్ మీద మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన స్పీకర్ చర్యలకు రెఢీ అయ్యారు. బిగుతైన దుస్తులు ధరించి పార్లమెంటుకు సమావేశానికి హాజరైన సిచ్వాలేను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి దుస్తులు ధరించాలని హితబోధ చేయటం గమనార్హం. దీంతో.. సదరు ఎంపీ ఏమీ మాట్లాడకుండా సభ నుంచి బయటకు వచ్చేశారు. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినప్పటికి.. తాజాగా వచ్చిన ఫిర్యాదుపై తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుందని.. అందుకే ఆమెను సభ నుంచి బయటకు పంపేశారు. ఇకపై వచ్చే సభ్యులంతా జాగ్రత్తగా డ్రెస్ కావాలని కోరారు.
టాంజానియా పార్లమెంట్ నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు టైట్ జీన్సు వేసుకురావటం నిబంధనలకు విరుద్ధమని మిగిలిన వారు చెబుతున్నారు. కొందరు మహిళా ఎంపీలు రూల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా.. తమకు నచ్చిన దుస్తుల్లో వచ్చారు. అందుకు భిన్నంగా అనూహ్య చర్య తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఆమె వేసుకున్న దుస్తులకు అంత కఠిన చర్య తీసుకోవాల్సి ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on June 4, 2021 9:22 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…