మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పై భూ కబ్జా ఆరోపణలు చేయడంతో.. టీఆర్ఎస్ నుంచి తప్పుకొని.. బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ కండువా కప్పుకునేందుకు ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉన్నారు.
ఒకవైపు ఆ ప్రయత్నాల్లో ఉంటూనే… మరోవైపు టీఆర్ఎస్ లోని కీలక నేతలను కూడా పార్టీకి దూరం చేసేపనిలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. టీఆర్ఎస్ లోని అసంతృప్తులంతా.. ఈటల వైపు మొగ్గుచూపుతున్నారని అందరూ అనుకుంటూ ఉన్నారు.
తాజాగా.. ఈ మహిళా నేత.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్, సీనియర్ నాయకురాలు తుల ఉమ కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆమె.. ఈటలతో సమావేశం కూడా అయ్యారు.
అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ విన్న తర్వాత.. ఆమె పార్టీ మారటం ఖాయమని అర్థమైపోయింది. కేసీఆర్ పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ఆమె విమర్శలు చేయడం గమనార్హం.
స్వరాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలని పరిష్కరించినమా?, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపినమా? ఆదర్శవంతం అయిన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మించుకున్నామా? తెలంగాణ వనరులను సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా, మరి ఒక వర్గం కొల్లగూడుతుందా? వీటిని సమీక్షించుకోవాలి అంటూ ఉమ వ్యాఖ్యానించారు. పైగా తెలంగాణ కోసం కృషి చేసిన సుస్మా స్వరాజ్, సోనియా గాంధీ, మీరా కుమార్ పేర్లను ప్రస్తావించారు తప్పా కేసీఆర్ పేరును మాత్రం తీసుకోలేదు. దీంతో.. ఆమె టీఆర్ఎస్ కి దూరమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి తుల ఉమ టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. ఆమెకు దక్కలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకొని ఆమె ఈటల సహాయంతో బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…