రెండు+రెండు= 4 అని లెక్కల్లో కరెక్టే. కానీ రాజకీయాల్లో ప్రతిసారి 2+2=4 అవుతుందని చెప్పేందుకు లేదు. కొన్నిసార్లు జీరో కూడా కావచ్చు. రాజకీయాలే అంత ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో, ఎవరిని ఎందుకు అదఃపాతాళంలోకి తొక్కేస్తుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడింతా దేనికంటే తెలంగాణా రాజకీయాల్లో ఈ రోజుకి హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ అనే చెప్పాలి. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన వార్తలు హాటు హాటుగా మారాయి.
వారం తర్వాత ఫైనల్ గా నియోజకవర్గం హుజూరాబాద్ లో మద్దతుదారులతో మాట్లాడి కమలం కండువా కప్పుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే బహుశా బీజేపీలో చేరటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే బీజేపీలో చేరాలని అనుకుంటున్న ఈటల ఓ విషయంలో నడ్డాను గ్యారెంటీ అడగారట.
రాజకీయాలు ఏమైనా కుక్కరా ? లేకపోతే రెఫ్రిజిరేటరా ? గ్యారెంటీకార్డు ఇవ్వటానికి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈరోజు ఏమిటనేదే ప్రధానం. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో ఎవ్వరు అంచనా వేయలేరు కాబట్టే. తాను బీజేపీలో చేరిన తర్వాత భవిష్యత్తులో బీజేపీ-టీఆర్ఎస్ ఒకటవ్వవని గ్యారెంటీ ఏమిటని మాజీమంత్రి నడ్డాను అడగారట. టీఆర్ఎస్-బీజేపీ ఒకటే అని జరుగుతున్న ప్రచారాన్ని నడ్డా దృష్టిలో ఈటల పెట్టారట.
అందుకు నడ్డా కూడా గ్యారెంటీ ఇచ్చేశారట. తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీనే కాబట్టి ఫికర్ వద్దని భరోసా ఇచ్చారట. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లే తెలంగాణాలో కూడా అదే పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారట. ఈటల గ్యారెంటీ అడగటం, నడ్డా ఇచ్చేయటం అంతా బాగానే ఉంది.
అయినా ఏ పార్టీతో పెట్టుకోవాలి ? ఏ పార్టీని దూరం పెట్టేయాలన్న నిర్ణయం నడ్డా చేతిలో లేదన్న విషయం యావత్ దేశమంతా తెలుసు. పొత్తులు, చిత్తులు అన్నీ నరేంద్రమోడి, అమిత్ షా లే డిసైడ్ చేస్తారు. జస్ట్ ఆదేశాలను ఫాలో అవ్వటమే నడ్డా చేయగలిగింది. రేపు అవసరమైతే తెలంగాణాలో కేసీయార్ తో పొత్తు పెట్టుకోవాలంటే మోడి ఏమాత్రం మొహమాటపడరు. అదే జరిగితే మరి గ్యారెంటీ తీసుకున్న ఈటల ఏమంటారో ?
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…