కరోనా సెకండ్ వేవ్ విలయం భారతదేశంలో ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసింది. ఈ దశలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ లేకపోతే దీన్నుంచి మనం బయటపడటం కష్టం అని ఫిక్సయ్యాడు. ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. అయితే, మన దేశ జనాభాకు సరిపడా ఇక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవడం లేదు. అందుకే దాదాపు అన్ని వ్యాక్సిన్లకు ద్వారాలు తెరవక తప్పదు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈరోజు రష్యా నుంచి 3 మిలియన్ల వ్యాక్సిన్లు ఇండియాకు చేరుకున్నాయి. ఇది స్పుత్నిక్ వ్యాక్సిన్. మిగతా ఫైజర్, మోడెర్నాతో పాటు ఇతర వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఐసీఎంఆర్ ఛీఫ్ భార్గవ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఆగస్టు మొదటి వారానికల్లా మన దేశంలో ప్రతిరోజూ కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.
డిసెంబరు నాటికి … దాదాపు 108 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ వేస్తామని, మూడో వేవ్ అంచనాలు వేస్తున్న సమయం కంటే ముందే మొత్తం 130 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు భార్గవ. టీనేజర్లకు కూడా మలిదశలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. రెండేవేవ్ లో లాక్ డౌన్లు, కరోనా పరీక్షలతో బయటపడ్డాం… గాని ఇవంత మంచి మార్గాలేం కావు, వ్యాక్సినే అత్యుత్తమ మార్గం అని ఆయన స్పష్టం చేశారు.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…