కరోనా సెకండ్ వేవ్ విలయం భారతదేశంలో ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసింది. ఈ దశలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ లేకపోతే దీన్నుంచి మనం బయటపడటం కష్టం అని ఫిక్సయ్యాడు. ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. అయితే, మన దేశ జనాభాకు సరిపడా ఇక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవడం లేదు. అందుకే దాదాపు అన్ని వ్యాక్సిన్లకు ద్వారాలు తెరవక తప్పదు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈరోజు రష్యా నుంచి 3 మిలియన్ల వ్యాక్సిన్లు ఇండియాకు చేరుకున్నాయి. ఇది స్పుత్నిక్ వ్యాక్సిన్. మిగతా ఫైజర్, మోడెర్నాతో పాటు ఇతర వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఐసీఎంఆర్ ఛీఫ్ భార్గవ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఆగస్టు మొదటి వారానికల్లా మన దేశంలో ప్రతిరోజూ కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు.
డిసెంబరు నాటికి … దాదాపు 108 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ వేస్తామని, మూడో వేవ్ అంచనాలు వేస్తున్న సమయం కంటే ముందే మొత్తం 130 కోట్ల భారతీయులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు భార్గవ. టీనేజర్లకు కూడా మలిదశలో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. రెండేవేవ్ లో లాక్ డౌన్లు, కరోనా పరీక్షలతో బయటపడ్డాం… గాని ఇవంత మంచి మార్గాలేం కావు, వ్యాక్సినే అత్యుత్తమ మార్గం అని ఆయన స్పష్టం చేశారు.
This post was last modified on June 2, 2021 6:27 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…