అవును మీరు చదివింది నిజమే. కాకపోతే క్షమాపణలు చెప్పింది మొదటినుండి బీజేపీలోనే ఉన్న నేతకాదు. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుండి కమలంపార్టీలో చేరిన సోనాలి గుహ అనే సీనియర్ నేత. నాలుగుసార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుహ ఎన్నికలకు ముందు మమతాబెనర్జీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు.
అయితే వివిధ కారణాల వల్ల గుహ అక్కడ ఇమడలేకపోయారట. అందులోను మమత హ్యాట్రిక్ విజయం సాధించారు కదా. ఇక చెప్పేదేముంది తాజాగా గుహ దీదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో క్షమాపణలు చెప్పుకున్నారు. అచ్చంగా ఏపి రాజకీయాల్లో జరిగినట్లే అక్కడ కూడా జరుగుతోంది. వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో చాలామంది మళ్ళీ వైసీపీలో చేరటానికి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పుకున్నట్లే.
తాను బీజేపీలో ఇమడలేకపోతున్నట్లు గుహ తెగ బాధపడిపోయారు. దీదీని వదిలి ఉండలేకపోతున్నట్లు తన బాధనంతా చెప్పుకున్నారు. దీదీ క్షమించేస్తే ఎప్పుడెప్పుడు పార్టీలో మళ్ళీ చేరిపోదామా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకున్నారు. బీజేపీలో చేరిన తనతో మమతను తిట్టిద్దామని కమలంనేతలు ప్రయత్నాలు చేసినా తాను మాత్రం దీదీని ఒక్కమాట కూడా అనలేదని గుర్తుచేశారు.
తృణమూల్ ను వీడి బీజేపీలో చేరి తాను తప్పుచేశానని తన శేషజీవితమంతా దీదీ సేవలోనే గడిపేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుహ రాసిన లేఖ బాగానే ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మమత ఓడిపోయి బీజేపీ గెలిచుంటే అప్పుడు గుహ ఇదే విధంగా బీజేపీలో చేరినందుకు పశ్చాత్తాపం వ్యక్తంచేసేవారేనా ? మొత్తంమీద మమత హ్యాట్రిక్ విజయంతో తృణమూల్ ఫిరాయింపుల్లో పశ్చాత్తాపం మొదలైనట్లే ఉంది. గుహతో పాటు మరో 28 మంది ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు కూడా బీజేపీలోకి ఫిరాయించారు. మరి మిగిలిన వాళ్ళు ఏమి చేస్తారో చూద్దాం.
This post was last modified on May 23, 2021 7:17 pm
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…