Political News

కేరళలో సాధ్యమైంది మనకెందుకు కుదరదు జగన్?

వ్యాక్సిన్ కొనుగోలు చేయటానికి సిద్ధం.. కేంద్రం చెప్పినట్లే కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ఏపీ సర్కారు వినిపిస్తున్న వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఇచ్చే కోటాతో సంబంధం లేకుండా.. కొన్ని రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది ఏపీ సర్కారు.

రాష్ట్రంలో టీకా అవసరం ఉన్న వారందరికి ఉచితంగా వేయాలన్న సంకల్పంలో ప్రభుత్వం ఉందని.. అయితే కేంద్రం మాత్రం45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తామంటోందని చెబుతోంది. టీకా కోసం రూ.1600 కోట్ల ఖర్చుకు సిద్ధమైనప్పటికి.. కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. కేంద్రంతో సంబంధం లేకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా వ్యాక్సిన్ కంపెనీల్ని సంప్రదించి.. నేరుగా కొనుగోలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు.

కేరళ.. ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు తమకు తాముగా టీకాలు కొనుగోలు చేసేలా గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నప్పుడు.. కేంద్రం పరిమితులకు లోబడి కొనుగోలు చేయాలని చెప్పటాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం కోటాను ఫాలో అయితే.. ఏపీలో వ్యాక్సినేషన్ కు మరింత సమయం పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలని కోరుతున్నారు. కేంద్రం ఒకవేళ తక్కువగా పంపిణీ చేస్తే.. దాని మీద పోరాడటం.. అవసరమైతే తామే టీకా కొనుగోలు చేసుకుంటామని చెబితే సరిపోతుంది కదా? అన్న మాట వినిపిస్తోంది.

ఏమైనా.. వ్యాక్సినేషన్ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను పక్కన పెట్టి.. కేంద్ర నిర్ణయాల్ని గౌరవిస్తూనే.. తమ వంతు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. లేకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు. మేలో 16.85 లక్షల వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తే.. ఇప్పటివరకు వచ్చినవి 11.64 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే. ఇప్పటికి 5.21 లక్షల వ్యాక్సిన్లు రావాల్సి ఉంది. మేలో 16.85 లక్షల టీకాల కొనుగోలుకు కేంద్రం ఓకే చెప్పినట్లుగా చెబుతోంది. అదే సమయంలో జూన్ లో 14.86 లక్షల వ్యాక్సిన్లను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇవ్వటం చూస్తే.. నెల గడుస్తున్న కొద్దీ టీకాల పంపిణీ పెరగాలే కానీ ఇలా తగ్గటం దేనికి నిదర్శనం? ఇలా కొనసాగితే.. వ్యాక్సినేషన్ ఎప్పటికి పూర్తి అయ్యేను?

This post was last modified on May 23, 2021 12:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

48 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

51 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago