ఏపీలో ఆ మధ్యన జారీ చేసిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. నోటిఫికేషన్ జారీలో నిబంధనల్ని పాటించలేదని పేర్కొంది. సుప్రీం ఆదేశాల్ని పాటించలేదన్న విషయాన్ని పేర్కొన్నారు.
పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాల్ని పాటించలదేని.. అందుకే నోటిఫికేషన్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాజకీయంగా పెను సంచలనంగా మారనుంది. పరిషత్ నోటిఫికేషన్ మీద విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలో నోటిఫికేషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజా తీర్పు జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ కానుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. తమ వాదనను సుప్రీంలో వినిపించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on May 21, 2021 11:35 am
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…
‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…