ఏపీలో ఆ మధ్యన జారీ చేసిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. నోటిఫికేషన్ జారీలో నిబంధనల్ని పాటించలేదని పేర్కొంది. సుప్రీం ఆదేశాల్ని పాటించలేదన్న విషయాన్ని పేర్కొన్నారు.
పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాల్ని పాటించలదేని.. అందుకే నోటిఫికేషన్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాజకీయంగా పెను సంచలనంగా మారనుంది. పరిషత్ నోటిఫికేషన్ మీద విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలో నోటిఫికేషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజా తీర్పు జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ కానుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. తమ వాదనను సుప్రీంలో వినిపించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on May 21, 2021 11:35 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…