Political News

బాబు హైదరాబాద్ దాటరు.. జగన్ తాడేపల్లి వీడరు

రాజకీయ చైతన్యం అన్నంతనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుంది చాలామందిలో. పేరుకు పిల్లాడే కావొచ్చు కానీ.. రాజకీయ చైతన్యం ఆంధ్రా ప్రాంతంలోని ప్రతి సందులోనూ కనిపిస్తుందన్న మాట అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో.. కరోనా కష్ట కాలంలో ప్రజలకు నేనున్నా అన్న ధీమా ఇచ్చే అధినేతే లేకుండా పోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ సర్కారు పవర్లోకి రావటం తెలిసిందే.

కరోనా కేసులు అంకతంతకూ పెరిగిపోతూ.. రోజుకు దగ్గర దగ్గర పాతిక వేల వరకు (సోమవారం కాస్త తగ్గుముఖం పట్టి.. ఇరవై వేల కంటే తక్కువగా నమోదయ్యాయి) నమోదు కావటం.. అధికారికంగా నమోదయ్యే మరణాలకు.. అనధికారికంగా నమోదవుతున్న చావులకు ఎక్కడా పొంతన ఉండని పరిస్థితి. కరోనా సోకి.. కాస్త సీరియస్ అయితే చాలు.. ఏపీకి చుట్టుపక్కల ఉన్న వివిధ రాష్ట్ర రాజధానులకు వైద్యం కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సుల విషయంలో తెలంగాణ సరిహద్దుల్లో ఎదురైన అనుభవం.. హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీరియస్ అయితే కానీ.. సెట్ కాని పరిస్థితి.
ఉన్న రాష్ట్రాన్ని వదిలి.. ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం వేరే రాష్ట్రాలకు పరుగులు తీసే దౌర్భాగ్యాన్ని ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఏపీ విషయానికి వస్తే.. సూపర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కరోనా కష్ట కాలంలోనూ వేలాది రూపాయిల్ని సంక్షేమ పథకాల కింద బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తున్న ఆయన.. బాధితులకు అవసరమైన ఆక్సిజన్.. బెడ్ల కోసం మాత్రం కిందా మీదా పడుతున్నారు. ఇప్పుడున్న కష్ట కాలంలో ప్రజల్ని మరింతగా ఆదుకునేందుకు.. వారికి అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు చర్యల వేగాన్ని పరుగులు తీయాల్సి ఉంది. కానీ.. అదేమీ జరుగుతున్నట్లుగా కనిపించదు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీ అధికారపక్ష నేత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ వీడేందుకు అస్సలు ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. నిత్యం అధికారులకు రివ్యూలు నిర్వహించటం.. ప్రెస్ రిలీజ్ లు విడుదల చేయటంలాంటివి చేస్తున్నారు కానీ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నదే లేదు. కరోనా కష్ట కాలంలో ఇలా ఊళ్లు పట్టుకొని తిరుగుతారా? అన్న సందేహం రావొచ్చు. జగన్ అంటే అధికారంలో ఉన్నారు. బోలెడన్ని బాధ్యతలు ఉంటాయని సరిపెట్టుకోవచ్చు.

మరి.. విపక్ష నేత చంద్రబాబు మాటేమిటి? సీనియర్ నేతగా.. సంక్షోభాలెన్నింటినో చూసిన అధినేతగా పేరున్న ఆయన.. కరోనా వేళలో ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న తన రాష్ట్ర ప్రజల కోసం ఆయన కనీసం ఏపీలో కూడా ఉండకుండా హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితం కావటం గమనార్హం. ఆంధ్రోళ్ల సుడి కాకుంటే.. ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసు ను దాటి బయటకు రారు. విపక్ష నేత ఏమో హైదరాబాద్ లోని సొంతింటిని వదిలి అడుగు బయటపెట్టేందుకు ఇష్టపడరు. ఇలాంటి నేతలున్న ఏపీ ప్రజలకు మించిన సుడిగాళ్లు ఇంకెవరు ఉంటారు చెప్పండి?

Satya

Recent Posts

పశ్చిమలో కూటమిలో కుంపట్లు.. బాబు, పవన్ సీరియస్.. ?

గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…

3 hours ago

పాతికేళ్ల సినిమాకి సీక్వెల్ అవసరమా

ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…

7 hours ago

జగన్ సభకు అనుమతి ఎందుకు లేదు పవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. ఈ నెల 2న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన తెలంగాణ న‌వ‌నిర్మాణ సంక‌ల్ప స‌భ‌కు పోలీసులు అనుమ‌తి…

8 hours ago

సురేందర్ రెడ్డి సమస్య ఎప్పుడు తీరెనో

దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…

9 hours ago

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

10 hours ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

10 hours ago