ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారమే హాట్ టాపిక్. ఏడాదిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రభుత్వం మీదే తీవ్ర విమర్శలు చేస్తూ రెబల్గా మారిన రఘురామను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం తెలిసిందే. రెండు రోజుల కిందట ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం.. తర్వాతి రోజు కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా ఆయన పాదాలు కమిలిపోయి కనిపించడం.. రఘురామను పోలీసులు కొట్టినట్లుగా ఆయన లాయర్లు ఆరోపించాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ వైద్యాధికారులను నివేదిక కోరడం తెలిసిన సంగతే. ఐతే ఆదివారం కోర్టుకు సమర్పించిన వైద్యులు.. రఘురామను పోలీసులు కొట్టినట్లుగా ఆధారాలేమీ లేవని తేల్చినట్లు సమాచారం. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది.
రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని.. రెండు పాదాలు, అరికాలు రంగు మారాయని.. కానీ బయటికి గాయాలు ఏమీ కనిపించడం లేదని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారట. అయితే పాదాలు రంగు మారడానికి కారణం చర్మ సమస్య అయి ఉండొచ్చని.. రఘురామకు సోరియాసిస్ ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. రఘురామకు నాలుగున్నర నెలల క్రితం బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆయన్ని కార్డియాలజిస్ట్ దగ్గరికీ పంపామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే ఈ నివేదికకు సంబంధించి ఓ టీవీ ఛానెల్లో చర్చ జరగ్గా.. ఫోన్ ద్వారా రఘురామ కృష్ణంరాజు సతీమణి రమాదేవి అందులో మాట్లాడారు. తన భర్తకు సోరియాసిస్ ఉన్నట్లుగా చెప్పడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇన్నేళ్లలో తనకు ఎప్పుడూ తెలియలేదని.. అది అబద్ధమని ఆమె అన్నారు. తన భర్తను ఆదివారం రాత్రి జైల్లో చంపేందుకు కుట్ర జరిగినట్లుగా ఈ చర్చ సందర్భంగా ఆమె ఆరోపించడం గమనార్హం.
This post was last modified on May 17, 2021 9:40 am
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…
రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…
నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…