ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారమే హాట్ టాపిక్. ఏడాదిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రభుత్వం మీదే తీవ్ర విమర్శలు చేస్తూ రెబల్గా మారిన రఘురామను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం తెలిసిందే. రెండు రోజుల కిందట ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం.. తర్వాతి రోజు కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా ఆయన పాదాలు కమిలిపోయి కనిపించడం.. రఘురామను పోలీసులు కొట్టినట్లుగా ఆయన లాయర్లు ఆరోపించాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ వైద్యాధికారులను నివేదిక కోరడం తెలిసిన సంగతే. ఐతే ఆదివారం కోర్టుకు సమర్పించిన వైద్యులు.. రఘురామను పోలీసులు కొట్టినట్లుగా ఆధారాలేమీ లేవని తేల్చినట్లు సమాచారం. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది.
రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని.. రెండు పాదాలు, అరికాలు రంగు మారాయని.. కానీ బయటికి గాయాలు ఏమీ కనిపించడం లేదని వైద్యులు ఆ నివేదికలో పేర్కొన్నారట. అయితే పాదాలు రంగు మారడానికి కారణం చర్మ సమస్య అయి ఉండొచ్చని.. రఘురామకు సోరియాసిస్ ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. రఘురామకు నాలుగున్నర నెలల క్రితం బైపాస్ సర్జరీ జరిగిన నేపథ్యంలో ఆయన్ని కార్డియాలజిస్ట్ దగ్గరికీ పంపామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే ఈ నివేదికకు సంబంధించి ఓ టీవీ ఛానెల్లో చర్చ జరగ్గా.. ఫోన్ ద్వారా రఘురామ కృష్ణంరాజు సతీమణి రమాదేవి అందులో మాట్లాడారు. తన భర్తకు సోరియాసిస్ ఉన్నట్లుగా చెప్పడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం ఇన్నేళ్లలో తనకు ఎప్పుడూ తెలియలేదని.. అది అబద్ధమని ఆమె అన్నారు. తన భర్తను ఆదివారం రాత్రి జైల్లో చంపేందుకు కుట్ర జరిగినట్లుగా ఈ చర్చ సందర్భంగా ఆమె ఆరోపించడం గమనార్హం.
This post was last modified on May 17, 2021 9:40 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…