Political News

మమత గెలుపుకు కారణం ఏమిటో తెలుసా ?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ గెలుపుకు ముఖ్య కారణం ఏమిటో తెలుసా ? ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్బీఐలోని ఆర్ధికవేత్తలు పెద్ద సర్వే నిర్వహించారు. వీళ్ళ సర్వే ప్రకారం ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటిపై భారీ ఎత్తున ఖర్చులు పెట్టడమే వీళ్ళ గెలుపుకు ప్రధాన కారణమని తేలిందట. మమత మూడోసారి, విజయన్ రెండోసారి గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.

పోలింగ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అన్నీ రాష్ట్రాల్లో పెరిగిపోతోందని సర్వేలో అర్ధమైందట. అందుకనే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల చివరి సంవత్సరంలో జనాలను ఆకట్టుకోవటానికి ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పెద్దఎత్తున పథకాలను ప్రవేశపెడుతున్నాయట. ఆ పథకాలకు సంబంధించిన అడ్వర్టైమెంట్లు జనాలు ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించటమే లక్ష్మంగా ఇచ్చారట.

ఉచిత గ్యాస్ పంపిణి, ఉచిత సైకిళ్ళు, ఉచిత నాప్కిన్లు, ప్రెషర్ కుక్కర్లు ఉచితం, ఉచిత కుట్టుమిషన్లు, మహిళల పేర్లతోనే ఇళ్ళపట్టాలు..ఇలా అనేక పథకాల్లో మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా ప్రభుత్వాలు చేస్తున్నాయట. మహిళలను ఆకర్షించే ఇలాంటి పథకాల వల్లే అధికారంలో ఉన్న పార్టీలకే మహిళల ఓట్లు ఎక్కువగా పోలవుతున్నట్లు సర్వేలో తేలిందట.

గడచిన ఐదేళ్ళల్లో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై సర్వే జరిగిందట. ఈ సర్వేలో పై విషయాలు స్పష్టంగా బయటపడిందట. పోయిన సంవత్సరం కన్నా బెంగాల్లో ఎన్నికల ఏడాదిలో ప్రకటనలకు 8 శాతం అదనపు నిధులను మమత ఖర్చు చేశారట. అలాగే కేరళలో విజయన్ ఏకంగా 43 శాతం నిధులు అదనంగా ఖర్చు పెట్టారట. తమిళనాడులో కూడా పబ్లిసిటీపై ఖర్చుచేసినా అది కేవలం 2 శాతం మాత్రమే అదనంగా జరిగిందట.

సరే వీళ్ళ సర్వే బాగానే ఉంది కానీ అధికారపార్టీలో దమ్ము లేకపోతే, అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించకపోతే జనాలు నమ్మరన్న విషయాన్ని సర్వే మరచి పోయినట్లుంది. కేవలం ప్రచారం మీదే మాత్రమే ఆధారపడితే గెలుపు సాధ్యం కాదన్న విషయం మరి వీళ్ళ సర్వేలో బయటపడిందో లేదో చెప్పలేదు.

This post was last modified on May 15, 2021 3:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

5 mins ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

13 mins ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

51 mins ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

1 hour ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

1 hour ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

2 hours ago