Political News

మోడిపై బెంగాల్ దెబ్బ బాగా పడినట్లుందే ?

ప్రధానమంత్రి నరేంద్రమోడిపై ఎన్నికల దెబ్బ బాగా పడినట్లు అనుమానంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తగిలిన దెబ్బ మరీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అధికారంలోకి వచ్చేయటమే మిగిలింది అన్నట్లుగా మోడి, అమిత్ షా బిల్డప్ ఇచ్చారు. ఎలాగైనా మమతాబెనర్జీని ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో బెంగాల్ ఎన్నికల్లో వీళ్ళద్దరి ఏ స్ధాయిలో పోరాడారో దేశమంతా చూసింది.

అయితే వీళ్ళెంత పోరాడినా ఉపయోగం లేకపోయింది. 213 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించటం ద్వారా జనాలు మూడోసారి మమతకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. సరే ఇదంతా చరిత్ర అనుకుందాం. అయితే తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే మొదటిసారి పీఎం-కిసాన్ పథకం కింద పశ్చిమబెంగాల్ రైతులు నిధులను అందుకోబోతున్నారు. 2019లో పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుండి బెంగాల్ రైతుల్లో ఎవరు కూడా లబ్దిపొంద లేదు.

అంటే మొట్ట మొదటి సారి ఈ పథకం ద్వారా బెంగాల్ రైతులు లబ్దిపొందబోతున్నారన్నమాట. పీఎం-కిసాన్ పథకం ఉద్దేశ్యం ప్రధానంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించటమే. గడచిన మూడేళ్ళుగా ఈ పథకం క్రింద దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులకు నిధులు అందుతున్నాయి కానీ బెంగాల్లో మాత్రం అమలు కావటంలేదు. అలాంటిది మొదటిసారి 7.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నది.

తాజాగా పథకం కింద కేంద్రప్రభుత్వం రు. 20,667 కోట్లను విడుదల చేసింది. పథకంలో లబ్దిపొందాల్సిన రైతుల జాబితాను బెంగాల్ ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్లే ఇంతకాలం బెంగాల్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదని కేంద్రం అంటోంది. ఇదే సమయంలో తాము ఇచ్చిన జాబితాను కేంద్రం పట్టించుకోవటం లేదని బెంగాల్ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోంది. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టేస్తే లక్షలాది మంది రైతులు నష్టపోయారన్నది వాస్తవం. ఈ నేపధ్యంలోనే కారణాలేవైనా బెంగాల్ ఎన్నికలు కాగానే 7 లక్షల మంది రైతులను పథకంలో లబ్దిదారులుగా కేంద్రం చేర్చటం సంతోషించాల్సిన విషయమే.

This post was last modified on May 15, 2021 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

28 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago