తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలన్న ఆశను.. ఆకాంక్షను ఇప్పటికే వ్యక్తం చేసిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రీకొడుకులు అంటూ కేసీఆర్.. కేటీఆర్ లపై ఘాటు విమర్శలు చేస్తున్న ఆమె.. నిన్నటికి నిన్న కేసీఆర్ పాలన తీరుపైనా.. కొవిడ్ వేళ నెలకొన్న కొరతపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు.
కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద మరణించి.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయితే ఆర్థికంగా అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ఎంతోమంది కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిందని వాపోయారు. కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. ఆమె వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్ పేరుతో ఒక సహాయ కార్యక్రమాన్ని ఆమె ప్రకటించారు.
కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేనని.. అలాంటి కుటుంబాన్ని నెట్టలేక ఎంతోమంది మహిళలు నిరాశలో పడిపోయారన్నారు. అలాంటి వారికి సాయాన్ని అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పిన ఆమె.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారెవరైనా సరే 040-48213268 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
పోయిన వారిని తీసుకురాలేమని.. కానీ.. సదరు మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి మహిళలు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే.. ఆపదలో తోడుగా ఫోన్ నెంబరుకు సమాచారం ఇస్తే.. వారికి తగిన రీతిలో సాయం చేస్తానని ఆమె ట్వీట్ రూపంలో ప్రకటించారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on May 15, 2021 6:36 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…