తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలన్న ఆశను.. ఆకాంక్షను ఇప్పటికే వ్యక్తం చేసిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే తండ్రీకొడుకులు అంటూ కేసీఆర్.. కేటీఆర్ లపై ఘాటు విమర్శలు చేస్తున్న ఆమె.. నిన్నటికి నిన్న కేసీఆర్ పాలన తీరుపైనా.. కొవిడ్ వేళ నెలకొన్న కొరతపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె సంచలన ప్రకటన చేశారు.
కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద మరణించి.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయితే ఆర్థికంగా అండగా నిలిచేందుకు తన వంతు సాయం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ఎంతోమంది కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిందని వాపోయారు. కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. ఆమె వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్ పేరుతో ఒక సహాయ కార్యక్రమాన్ని ఆమె ప్రకటించారు.
కొవిడ్ కారణంగా ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేనని.. అలాంటి కుటుంబాన్ని నెట్టలేక ఎంతోమంది మహిళలు నిరాశలో పడిపోయారన్నారు. అలాంటి వారికి సాయాన్ని అందించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పిన ఆమె.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారెవరైనా సరే 040-48213268 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
పోయిన వారిని తీసుకురాలేమని.. కానీ.. సదరు మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి మహిళలు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే.. ఆపదలో తోడుగా ఫోన్ నెంబరుకు సమాచారం ఇస్తే.. వారికి తగిన రీతిలో సాయం చేస్తానని ఆమె ట్వీట్ రూపంలో ప్రకటించారు. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on May 15, 2021 6:36 am
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…