Political News

కేంద్రానిది మరీ ఇంత ఓవర్ యాక్షనా ?

పశ్చిమబెంగాల్ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మరీ ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన 77 మంది బీజేపీ ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి రెండు రోజుల పాటు బెంగాల్లో కొన్ని అవంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు, కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులు చేసి విధ్వంసం సృష్టించినట్లు బీజేపీ నేతలు గోలపెట్టారు.

ఇదే సమయంలో ఓడిపోయిన బీజేపీ నేతలే తమ కార్యకర్తలపై దాడులు చేసి ఎదురు తమమీదే ఆరోపణలు చేస్తున్నట్లు తృణమూల్ నేతలు ఎదురుదాడులకు దిగారు. దాంతో బెంగాల్లో వాస్తవంగా ఏమి జరిగిందనే విషయంలో గందరగోళం పెరిగిపోయింది. ఇదే సమయంలో తృణమూల్ నేతల దాడులంటు కొన్ని ఫొటోలను బీజేపీ సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఆ ఫొటొల్లో చాలావరకు ఫేక్ ఫొటోలే అని తేలిపోయింది.

ఎప్పుడో జరిగిన అల్లర్ల ఫొటోలు, వీడియోలను తాజాగా జరిగినట్లు బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని బయపడింది. అయినా బీజేపీ నేతలు వాటినికి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. అల్లర్ల విషయమై మమతబెనర్జీ-గవర్నర్ మధ్య కూడా రచ్చ మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర పోలీసుల భద్రతపై తమకు నమ్మకం లేదంటు కేంద్ర హోంశాఖ ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే బీజేపీ నుండి గెలిచిన 77 మంది ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని.

77 మంది ఎంఎల్ఏల కోసం సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రంలోకి దిగేశాయి. వీరిలో 61 మంది ఎక్స్ క్యాటగిరి భద్రతను మిగిలిన వాళ్ళకు వై క్యాటగిరి భద్రత కల్సించబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారికి ఇప్పటికే ఉన్న జడ్ క్యాటగిరి భద్రత కంటిన్యు అవుతుంది. మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే బీజేపీ చాలా ఓవర్ యాక్షనే చేస్తున్నట్లుంది. బెంగాల్లో జరుగుతున్నది చూసిన తర్వాత 213 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మమతను ప్రశాంతంగా ఉండనిస్తారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి.

This post was last modified on May 12, 2021 10:31 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

2 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

3 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ…

3 hours ago

మొదటిసారి ద్విపాత్రల్లో అల్లు అర్జున్ ?

పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…

3 hours ago

పార్లమెంట్ బరి నుండి ప్రియాంక ఔట్ !

రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…

4 hours ago

కాంతార 2 కోసం కుందాపుర ప్రపంచం

క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…

4 hours ago