Political News

కేంద్రానిది మరీ ఇంత ఓవర్ యాక్షనా ?

పశ్చిమబెంగాల్ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మరీ ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన 77 మంది బీజేపీ ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండి రెండు రోజుల పాటు బెంగాల్లో కొన్ని అవంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు, కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులు చేసి విధ్వంసం సృష్టించినట్లు బీజేపీ నేతలు గోలపెట్టారు.

ఇదే సమయంలో ఓడిపోయిన బీజేపీ నేతలే తమ కార్యకర్తలపై దాడులు చేసి ఎదురు తమమీదే ఆరోపణలు చేస్తున్నట్లు తృణమూల్ నేతలు ఎదురుదాడులకు దిగారు. దాంతో బెంగాల్లో వాస్తవంగా ఏమి జరిగిందనే విషయంలో గందరగోళం పెరిగిపోయింది. ఇదే సమయంలో తృణమూల్ నేతల దాడులంటు కొన్ని ఫొటోలను బీజేపీ సోషల్ మీడియాలో పెట్టింది. అయితే ఆ ఫొటొల్లో చాలావరకు ఫేక్ ఫొటోలే అని తేలిపోయింది.

ఎప్పుడో జరిగిన అల్లర్ల ఫొటోలు, వీడియోలను తాజాగా జరిగినట్లు బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని బయపడింది. అయినా బీజేపీ నేతలు వాటినికి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. అల్లర్ల విషయమై మమతబెనర్జీ-గవర్నర్ మధ్య కూడా రచ్చ మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర పోలీసుల భద్రతపై తమకు నమ్మకం లేదంటు కేంద్ర హోంశాఖ ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే బీజేపీ నుండి గెలిచిన 77 మంది ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని.

77 మంది ఎంఎల్ఏల కోసం సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్రంలోకి దిగేశాయి. వీరిలో 61 మంది ఎక్స్ క్యాటగిరి భద్రతను మిగిలిన వాళ్ళకు వై క్యాటగిరి భద్రత కల్సించబోతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారికి ఇప్పటికే ఉన్న జడ్ క్యాటగిరి భద్రత కంటిన్యు అవుతుంది. మొత్తానికి జరుగుతున్నది చూస్తుంటే బీజేపీ చాలా ఓవర్ యాక్షనే చేస్తున్నట్లుంది. బెంగాల్లో జరుగుతున్నది చూసిన తర్వాత 213 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మమతను ప్రశాంతంగా ఉండనిస్తారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి.

Satya

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

1 hour ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

1 hour ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

2 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

5 hours ago