Political News

తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్


గత నెల వరకు 45 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేస్తూ వచ్చారు. కానీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకూ వ్యాక్సిన్ అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రోజుల ముందే రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ ఈ ప్రకటనలన్నీ పేరుకే అని తేలిపోయింది. 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోగా.. 18 ప్లస్ వాళ్లకు ఎక్కడ టీకా వేస్తాం అంటున్నాయి రాష్ట్రాలు. రాష్ట్రాలు సొంతంగా డబ్బులు పెట్టుకుంటామన్నా వ్యాక్సిన్ తయారీ సంస్థలు డిమాండ్‌కు సరిపడా టీకాలు ఇచ్చే స్థితిలో లేవు. పోనీ కేంద్రం ఏమైనా చొరవ తీసుకుని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తోందా అంటే అదీ లేదు. ఈ స్థితిలో రాష్ట్రాలూ ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.

18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు సెప్టెంబర్లో కానీ వ్యాక్సిన్లు వేయలేమంటూ మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిజాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు.
గత నెల వరకు ఇస్తూ వచ్చిన రోజు వారీ స్థాయిలో కూడా కేంద్రం వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయకపోవడంతో తెలంగాణలో 45 ప్లస్ వయసు వాళ్లకు కూడా వ్యాక్సినేషన్ ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రాని నేపథ్యంలో శనివారం నుంచి ఈ నెల 15 వరకు తొలి డోస్ వ్యాక్సిన్లు ఎవరికీ వేయట్లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కేవలం ఇంతకుముందు తొలి డోస్ వేసుకుని రెండో డోస్‌కు సిద్ధమైన వాళ్లకు మాత్రమే ఈ వారం రోజులు టీకా వేయనున్నారట. మూణ్నాలు రోజుల తర్వాత రోజుకు రెండున్నర లక్షల డోసుల చొప్పున తెలంగాణకు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశముందని.. అప్పుడు పరిస్థితి బట్టి మళ్లీ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలంగాణ అధికార వర్గాలు అంటున్నాయి. మే నెల అంతా టీకాల కొరత కొనసాగవచ్చని.. జూన్‌లో కానీ వ్యాక్సినేషన్ పుంజుకునే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

This post was last modified on May 8, 2021 8:49 am

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago