గత నెల వరకు 45 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేస్తూ వచ్చారు. కానీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకూ వ్యాక్సిన్ అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రోజుల ముందే రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ ఈ ప్రకటనలన్నీ పేరుకే అని తేలిపోయింది. 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోగా.. 18 ప్లస్ వాళ్లకు ఎక్కడ టీకా వేస్తాం అంటున్నాయి రాష్ట్రాలు. రాష్ట్రాలు సొంతంగా డబ్బులు పెట్టుకుంటామన్నా వ్యాక్సిన్ తయారీ సంస్థలు డిమాండ్కు సరిపడా టీకాలు ఇచ్చే స్థితిలో లేవు. పోనీ కేంద్రం ఏమైనా చొరవ తీసుకుని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తోందా అంటే అదీ లేదు. ఈ స్థితిలో రాష్ట్రాలూ ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.
18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు సెప్టెంబర్లో కానీ వ్యాక్సిన్లు వేయలేమంటూ మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిజాన్ని ఓపెన్గా చెప్పేశారు. తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు.
గత నెల వరకు ఇస్తూ వచ్చిన రోజు వారీ స్థాయిలో కూడా కేంద్రం వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయకపోవడంతో తెలంగాణలో 45 ప్లస్ వయసు వాళ్లకు కూడా వ్యాక్సినేషన్ ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రాని నేపథ్యంలో శనివారం నుంచి ఈ నెల 15 వరకు తొలి డోస్ వ్యాక్సిన్లు ఎవరికీ వేయట్లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
కేవలం ఇంతకుముందు తొలి డోస్ వేసుకుని రెండో డోస్కు సిద్ధమైన వాళ్లకు మాత్రమే ఈ వారం రోజులు టీకా వేయనున్నారట. మూణ్నాలు రోజుల తర్వాత రోజుకు రెండున్నర లక్షల డోసుల చొప్పున తెలంగాణకు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశముందని.. అప్పుడు పరిస్థితి బట్టి మళ్లీ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలంగాణ అధికార వర్గాలు అంటున్నాయి. మే నెల అంతా టీకాల కొరత కొనసాగవచ్చని.. జూన్లో కానీ వ్యాక్సినేషన్ పుంజుకునే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
This post was last modified on May 8, 2021 8:49 am
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…