దేశం యావత్తు కరోనా వైరస్ కష్టకాలంలో ఉండగా సాయం అందించటంలో నరేంద్రమోడి సర్కార్ పక్షపాతబుద్ధి బయటపడిందా ? అవుననే సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి మరి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటికే టీకాలను అందించటంలోను, ఆక్సిజన్ సరఫరా చేయటంలోనే కేంద్రం అనుసరిస్తున్న వివక్ష బయటపడింది. ఎక్కువ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు టీకాలను అందిచని విషయం బయటపడింది.
రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు తక్కువ టీకాలను సరఫరా చేసిన కేంద్రం అంతకన్నా తక్కువ కేసులు నమోదవుతున్న గుజరాత్ కు ఎక్కువ టీకాలు సరఫరా చేసిన విషయం బయటపడింది. ఇలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం వివక్ష చూపుతున్న విషయం స్పష్టమైపోయింది. కష్టకాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిపెట్టిన నరేంద్రమోడి సర్కార్ నాన్ బీజేపీ రాష్ట్రాలపై మాత్రం తక్కువ చూస్తోందని ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి.
సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తాజాగా విదేశాల నుండి పెద్దఎత్తున మెడికల్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ పంపిణిలో కూడా వివక్ష చూపుతోందనే గోల పెరిగిపోతోంది. ఇందుకు కారణం ఏమిటంటే ఆస్ట్రేలియా నుండి 1056 వెంటిలేటర్లు, బిపాప్-సిపాప్ యంత్రాలు, 43 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. అమెరికా నుండి 43 వేల ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు, 1.56 లక్షల రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు, పీపీఈ కిట్లు, బహ్రెయిన్ నుండి 2 ధ్రవీకృత ఆక్సిజన్ కంపెయినర్లు వచ్చాయి.
విదేశాల నుండి వచ్చిన మెడికల్ ఎక్విప్మెంట్ ను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్రం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత సాయాన్ని పంపిణీ చేశారో చెప్పమంటే మాత్రం చెప్పటంలేదు. ఇదే విషయాన్ని మీడియా ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం సమాధానం చెప్పటంలేదు. దీంతో బీజేపీ పాలితరాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ సాయం అందించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సాయం అందించటంలో పాదర్శకత పాటించని కారణంగానే కేంద్రం సమాధానాలు చెప్పటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
This post was last modified on May 7, 2021 1:38 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…