Political News

ప్రభుత్వాలపై పెరిగిపోతున్న ఒత్తిడి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్నకొద్దీ లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం ఒకటే ఏకైక మార్గమని ఒకవైపు న్యాయస్ధానాలు మరోవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పెట్టక వేరే దారి కనబడటంలేదు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సుప్రింకోర్టు, రాష్ట్రాల ప్రభుత్వాలపై హైకోర్టులు అనేకసార్లు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించమని చెప్పాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా తీరని నష్టాలు తప్పవన్న ఏకైక కారణంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అయితే ఆర్ధిక విషయాల గురించి ఆలోచిస్తుంటే పోతున్న ప్రజల ప్రాణాల గురించి ఎవరు ఆలోచించాలి ? అంటు కోర్టులు ప్రభుత్వాలను చాలా సీరియస్ గా ఆక్షేపిస్తున్నాయి.

ఇదే సమయంలో శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు మాట్లాడుతు కరోనా వైరస్ తీవ్రతను అడ్డుకోవటానికి లాక్ డౌన్ పెట్టక వేరేమార్గం లేదని పదే పదే సలహాలిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. వీళ్ళ సలహాలు, సూచనల సంగతిని పక్కన పెట్టేస్తే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నది మాత్రం వాస్తవం. రోజుకు వేలాదిమంది చనిపోతున్నారు. అలాగే రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్ మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. అలాగే తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. రెండో దశ వైరస్ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులు, గుండె పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. దీనివల్ల ఆక్సిజన్ అవసరం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అందుకనే రోజుకు 450 టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉన్నా జనాలకు సరిపోవటంలేదు. ముందు రోజుల్లో ఆక్సిజన్ అవసరం రోజుకు వెయ్యిటన్నులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.

This post was last modified on May 7, 2021 1:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago