Political News

ప్రభుత్వాలపై పెరిగిపోతున్న ఒత్తిడి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్నకొద్దీ లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం ఒకటే ఏకైక మార్గమని ఒకవైపు న్యాయస్ధానాలు మరోవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పెట్టక వేరే దారి కనబడటంలేదు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సుప్రింకోర్టు, రాష్ట్రాల ప్రభుత్వాలపై హైకోర్టులు అనేకసార్లు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించమని చెప్పాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా తీరని నష్టాలు తప్పవన్న ఏకైక కారణంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అయితే ఆర్ధిక విషయాల గురించి ఆలోచిస్తుంటే పోతున్న ప్రజల ప్రాణాల గురించి ఎవరు ఆలోచించాలి ? అంటు కోర్టులు ప్రభుత్వాలను చాలా సీరియస్ గా ఆక్షేపిస్తున్నాయి.

ఇదే సమయంలో శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు మాట్లాడుతు కరోనా వైరస్ తీవ్రతను అడ్డుకోవటానికి లాక్ డౌన్ పెట్టక వేరేమార్గం లేదని పదే పదే సలహాలిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. వీళ్ళ సలహాలు, సూచనల సంగతిని పక్కన పెట్టేస్తే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నది మాత్రం వాస్తవం. రోజుకు వేలాదిమంది చనిపోతున్నారు. అలాగే రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్ మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. అలాగే తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. రెండో దశ వైరస్ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులు, గుండె పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. దీనివల్ల ఆక్సిజన్ అవసరం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అందుకనే రోజుకు 450 టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉన్నా జనాలకు సరిపోవటంలేదు. ముందు రోజుల్లో ఆక్సిజన్ అవసరం రోజుకు వెయ్యిటన్నులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.

Satya

Recent Posts

ఏషియ‌న్ సునీల్‌పై నాగ‌వంశీ రివెంజ్?

టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కున్న పాపులారిటీనే వేరు. ప్ర‌స్తుతం…

33 minutes ago

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం…

2 hours ago

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…

2 hours ago

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

4 hours ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

11 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

11 hours ago