Political News

సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట‌.. జ‌గ‌న్ జీవోను కొట్టేసిన హైకోర్టు

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ చైర్మ‌న్‌గా ఉన్న సంగం డెయిరీకి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు అన్నింటినీ.. హైకోర్టు కొట్టివేసింది. దీంతో సంగం డెయిరీకి పెద్ద ఊర‌ట ల‌భించ‌గా.. సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ట‌యింది. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రపై పలు అవినీతి, అక్రమాలు, నయవంచన తదితర నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు కేసులు బనాయించారు.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ 1988 చట్టం ప్రకారం 13(1) (సీ) (డీ), ఐపీసీ 408 సెక్షన్‌ ప్రయోగించారు. డెయిరీకి సంబంధించి హోదాలో ఉన్న నయవంచనకు పాల్పడినట్టుగా సెక్షన్‌ 409 నమోదు చేశారు. వీటితోపాటు సంబంధిత సంస్థకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని మోసం చేసినట్టుగా సెక్షన్‌ 418ని కూడా నమోదు చేశారు. నయవంచన, మోసానికి సంబంధించి సెక్షన్‌ 420, ఆయా పత్రాల ఫోర్జరీకి సంబంధించి సెక్షన్‌ 465, తప్పుడు పత్రాలు అని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా అవి ఒరిజినల్‌గా గుర్తించారనే అభియోగం మేరకు సెక్షన్‌ 471ను నమోదు చేశారు.

డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, విశ్రాంత డీసీవో గురుమూర్తిలను సైతం పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేసేలా.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో డైరెక్ట‌ర్లు.. హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై తాజాగా విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీలో డైరెక్ట‌ర్ల‌కే పూర్తి ఆధిప‌త్యం ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.

అదేస‌మ‌యంలో డైరెక్ట‌ర్లు సాధార‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, డెయిరీని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. అదేస‌మ‌యంలో సంగం డెయిరీ ఆస్తుల క్ర‌య విక్ర‌యాలు.. త‌మ‌కు చెప్పే నిర్ణ‌యం తీసుకోవాల‌ని, త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇవి సాగుతాయ‌ని తేల్చి చెప్పింది. మొత్తంగా అత్యంత కీల‌క‌మైన ఏపీ డెయిరీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తూ.. తీసుకువ‌చ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ ప‌రిణామంతో సంగం డెయిరీకి భారీ ఊర‌ట ల‌భించ‌గా.. జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 7, 2021 1:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

25 minutes ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

44 minutes ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

1 hour ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

3 hours ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

4 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

4 hours ago