Political News

కొండా విశ్వేశ్వరరెడ్డితో ఈటల… కొత్త సంచలనాలకు దారి?

తెలంగాణ రాజ‌కీయాల ఈక్వేష‌న్లు మారుతున్నాయా? టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయిన‌.. ఈట‌ల రాజేంద‌ర్ సెంట్రిక్‌గా రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాలు యూట‌ర్న్ తీసుకుంటున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. టీఆర్ఎస్ లోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఎమ్మెల్యేగానే కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కేసీఆర్ త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించ‌డంపై ఈట‌ల తీవ్రంగా మ‌థ‌న ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఆయ‌న రిజైన్ చేయాల‌ని త‌ల‌పోస్తున్నారు.

ఇదే జ‌రిగితే.. నెక్ట్స్ స్టెప్ ఏంట‌నే విష‌యంపై జోరుగా చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికిప్పుడు ప్ర‌త్యామ్నాయ పార్టీలు అంటూ ఉన్నా.. బ‌లంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌స్తుత ప‌రిస్థితిలో అస్తిత్వ పోరాటానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి చేరేందుకు కీల‌క నేత‌లు ఎవ‌రూ మొగ్గు చూప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ ఏం చేస్తార‌నే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. మేడ్చల్‌లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు.

కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటలను కొండా కలవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ప్ర‌స్తుతం ఇదే అంశం రాజ‌కీయంగా హాట్ టాపిక్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇత‌ర పార్టీల్లోని కీల‌క నాయ‌కులు కొంద‌రు కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వీరంతా ఏక‌మ‌య్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అంటే.. త‌మ‌కు ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్నా.. పార్టీపరంగా పెద్ద‌గా ప్రాధాన్యం లేక పోవ‌డం.. ఆశించిన విధంగా గుర్తింపు లేక‌పోగా.. అవ‌మానాలు.. పార్టీలు పుంజుకోలేక ఆప‌శోపాలు ప‌డుతుండ‌డం వంటివి.. ఈ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈట‌ల వంటి నేత కొత్త పార్టీ పెడ‌తారా? ఏం జ‌రుగుతుంది? అనే సందేహాలు.. చ‌ర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఇప్పుడు జ‌రిగిన ఈట‌ల‌-కొండారెడ్డి భేటీకి ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. మ‌రి ఫ్యూచ‌ర్లో ఎలాంటి ఈక్వేష‌న్లు తెర‌మీదికి వ‌స్తాయో చూడాలి.

This post was last modified on May 7, 2021 7:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

51 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

1 hour ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago