కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మరోసారి ఫైరైంది. ప్రస్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకోవడంలోను, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాల్లో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని సుప్రీం కోర్టు మరోసారి సీరియస్గా వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరా వంటి పలు అంశాలపై.. సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మరోసారి.. దీనిపై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్ సహా.. పలు రాష్ట్రాలు.. తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ.. కొందరు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో వేసిన కేసులను కూడా సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇదే సమయంలో థర్డ్ వేవ్పై సుప్రీం కోర్టు మరింత ఆదోంళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏమేరకు సన్నద్ధంగా ఉందని.. ప్రశ్నించింది. ముఖ్యంగా థర్డ్ వేవ్లో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని అంటున్న నిపుణుల హెచ్చరికలను కూడా సుప్రీం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విపత్కర పరిస్థితిలో కేంద్రం ఎలా సహకరిస్తోందో చెప్పాలని కూడా నిలదీసింది. వ్యాక్సిన్ సరఫరాను మరింతగా పెంచాలని సూచించిన సుప్రీం కోర్టు.. థర్డ్వేవ్ను తట్టుకునేందుకు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అదేసమయంలో ఢిల్లీకి మెడికల్ ఆక్సిజన్ను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
This post was last modified on May 6, 2021 3:44 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…