Political News

ప్ర‌ధాని మోడీపై సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

కేంద్ర ప్ర‌భుత్వంపై సుప్రీం కోర్టు మ‌రోసారి ఫైరైంది. ప్ర‌స్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. క‌రోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకోవ‌డంలోను, ప్ర‌జ‌ల‌కు స‌రైన వైద్య స‌దుపాయాలు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వంటి విష‌యాల్లో మోడీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్‌గా వ్యాఖ్యానించింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితులు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వంటి ప‌లు అంశాల‌పై.. సుమోటోగా విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మ‌రోసారి.. దీనిపై విచార‌ణ జ‌రిపింది.

ఈ సంద‌ర్భంగా కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ స‌హా.. ప‌లు రాష్ట్రాలు.. త‌మ‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయడం లేదంటూ.. కొంద‌రు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో వేసిన కేసుల‌ను కూడా సుప్రీం కోర్టు సుమోటోగా విచార‌ణ చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ వేవ్‌పై సుప్రీం కోర్టు మ‌రింత ఆదోంళ‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వం ఏమేర‌కు స‌న్న‌ద్ధంగా ఉంద‌ని.. ప్ర‌శ్నించింది. ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్న నిపుణుల హెచ్చ‌రిక‌ల‌ను కూడా సుప్రీం కోర్టు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది.

వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో కేంద్రం ఎలా స‌హ‌క‌రిస్తోందో చెప్పాల‌ని కూడా నిల‌దీసింది. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాను మ‌రింత‌గా పెంచాల‌ని సూచించిన సుప్రీం కోర్టు.. థ‌ర్డ్‌వేవ్‌ను త‌ట్టుకునేందుకు చిన్నారుల‌కు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. అదేస‌మయంలో ఢిల్లీకి మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

This post was last modified on May 6, 2021 3:44 pm

Share
Show comments

Recent Posts

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

1 minute ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

21 minutes ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

2 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

2 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

3 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

4 hours ago