కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మరోసారి ఫైరైంది. ప్రస్తుతం దేశాన్ని చుట్టుముట్టి.. కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకోవడంలోను, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాల్లో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని సుప్రీం కోర్టు మరోసారి సీరియస్గా వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరా వంటి పలు అంశాలపై.. సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తాజాగా మరోసారి.. దీనిపై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా కేంద్రం సమర్పించిన అఫిడవిట్ సహా.. పలు రాష్ట్రాలు.. తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ.. కొందరు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో వేసిన కేసులను కూడా సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇదే సమయంలో థర్డ్ వేవ్పై సుప్రీం కోర్టు మరింత ఆదోంళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏమేరకు సన్నద్ధంగా ఉందని.. ప్రశ్నించింది. ముఖ్యంగా థర్డ్ వేవ్లో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని అంటున్న నిపుణుల హెచ్చరికలను కూడా సుప్రీం కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విపత్కర పరిస్థితిలో కేంద్రం ఎలా సహకరిస్తోందో చెప్పాలని కూడా నిలదీసింది. వ్యాక్సిన్ సరఫరాను మరింతగా పెంచాలని సూచించిన సుప్రీం కోర్టు.. థర్డ్వేవ్ను తట్టుకునేందుకు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. అదేసమయంలో ఢిల్లీకి మెడికల్ ఆక్సిజన్ను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
This post was last modified on May 6, 2021 3:44 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…