Political News

తమిళ రాజకీయాల్లో స్టాలిన్ రికార్డు

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సరికొత్త రికార్డు సృష్టించారనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి రాజకీయ వారసునిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న మొదటి వ్యక్తి స్టాలిన్ మాత్రమే. ఇప్పటివరకు తమిళనాడును పరిపాలించిన ముఖ్యమంత్రుల వారసులెవరు ముఖ్యమంత్రులు కాకపోవటం గమనార్హం. తమిళనాడు ఏర్పడిన దగ్గర నుండి చాలామందే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వారసత్వంగా సీఎం అయ్యింది మాత్రమే స్టాలిన్ ఒక్కరే.

1952 నుండి తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా రాజాజీ, కామరాజ్ నాడార్, భక్తవత్సలం, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జానకీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, పన్నీర్ శెల్వం, పళనిస్వామి పనిచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కామరాజ్ నాడార్, జయలలిత అవివాహితులు. అన్నాదురై, ఎంజీఆర్-జానకీ రామచంద్రన్ కు సంతానం లేదు. రాజాజీ, భక్తవత్సలంకు సంతానం ఉన్నా వాళ్ళెవరు రాజకీయాల్లోకి రాలేదు.

ఇక పన్నీర్ శెల్వం కొడుకు రవీంద్రకుమార్ ఎంపిగా ఉన్నారు. పళనిస్వామి సంతానం రాజకీయాల్లో లేరు. ఇక కరుణానిధి సంతానంలో ఇద్దర కొడుకులు, కూతురు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వీరిలో స్టాలిన్ డీఎంకే చీఫ్ గా, డీఎంకే శాసనసభాపక్ష నేత హోదాలో 7వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు. సో 1952 నుండి తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే వారసుని హోదాలో సీఎం అవుతున్న రికార్డు స్టాలిన్ కు మాత్రమే దక్కబోతోంది.

వారసుడంటే కరుణానిధి సీఎంగా ఉండగా మరణిస్తే ఆ ప్లేసులో కూర్చోలేదు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని గట్టిగా నిలబెట్టి ఎన్నికలను ఎదుర్కొని ప్రజాబలంతో మాత్రమే సీఎం అవబోతున్నారు. దేశంలో వారసుల హోదాలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, ఓం ప్రకాశ్ చౌతాలా సీఎంలయ్యారు.

This post was last modified on May 6, 2021 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago