పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం రివర్సుకొట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రధానంగా బయటకుతీసేది హిందుత్వ అంశాన్నే. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకున్న ప్రతి ఎన్నికలోను హిందుత్వఅంశాన్నే అస్త్రంగా ప్రత్యర్ధులపైకి ప్రయోగిస్తుంటుంది. ఇందులో భాగంగానే బెంగాల్ ఎన్నికల్లో కూడా పదే పదే హిందుత్వ కార్డును నరేంద్రమోడి, అమిత్, జేపే నడ్డా అండ్ కో మమతాబెనర్జీ పైకి ప్రయోగించింది.
అయితే ఫలితాల తర్వాత చూస్తే ఆ అస్త్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు అర్ధమవుతోంది. తాము ప్రయోగించిన హిందుత్వ అస్త్రం చివరకు తమనే రివర్సులో దెబ్బకొట్టేసిందని ఇఫుడు కమలనాదులకు అర్ధమైంది. మామూలుగా ఎన్నికల్లో డెవలప్మెంట్ అంశాలను కూడా ప్రస్తావిస్తారు. కానీ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమి చేసింది, చేయబోతోందనే అంశాలను మోడి అండ్ కో పెద్దగా ప్రస్తావించలేదు. ఎంతసేపు ముస్లింలు-హిందువులు, బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి వలసవచ్చిన ముస్లింల అంశం, అవినీతిని మాత్రమే టచ్ చేశారు.
అయితే దీన్ని దీదీ ముందే ఊహించారట. అందుకనే తన కులమేంటి, తన గోత్రమేంటి అనే విషయాలను పదే పదే ప్రస్తావించారు. ప్రతి బహిరంగ వేదికమీద కాళీమాత పారాయణం చేశారు. మంత్రాలను, స్తోత్రాలను పఠించారు. తాను మంత్రాలను చెప్పటమే కాకుండా ఇవే మంత్రాలను మోడి, అమిత్ షాలు చెప్పాలంటు చాలెంజ్ విసిరారు. పక్కా హిందువునైన తనను హిందువ్యతిరేకిగా ముద్రవేయాలని మోడి అండ్ కో చేస్తున్న ప్రయత్నాలను డైరెక్టుగానే చీల్చిచెండాడారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రాలను పఠించటంలో దీదీ చాలెంజ్ ను మోడి, షా ఒక్కసారిగా స్వీకరించలేదు. ఇక్కడే వీళ్ళకు సమస్యలు మొదలయ్యాయట. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి వలసలను నిరోధించాల్సిన కేంద్రం ఆ విషయంలో ఫెయిలై అదే మమత మీదకు నెట్టేస్తోందన్న విషయం జనాలకు బాగా అర్ధమైంది.
ఎన్నికల ప్రచారం జరిగిన దాదాపు రెండు నెలలు కూడా మమతను పదే పదే హిందువ్యతిరేకిగా ముద్ర వేయటానికి మోడి, షా చేసిన ప్రయత్నంతో జనాలకు చిర్రెత్తిందట. దాంతో హిందు-ముస్లిం అన్నతేడా లేకుండా మెజారిటి సెక్షన్లు మమతకే మద్దతుగా నిలబడటంతో అఖండ విజయం సాధ్యమైంది. మొత్తానికి తమ చేతిలోని బ్రహ్మాస్త్రమే తమకు రివర్సు కొట్టిందని ఇపుడు కమలనాదులు విశ్లేషించుకుంటున్నారట.
This post was last modified on May 4, 2021 10:11 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…