Political News

రివర్సు కొట్టిన బీజేపీ బ్రహ్మాస్త్రం

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాస్త్రం రివర్సుకొట్టింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రధానంగా బయటకుతీసేది హిందుత్వ అంశాన్నే. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకున్న ప్రతి ఎన్నికలోను హిందుత్వఅంశాన్నే అస్త్రంగా ప్రత్యర్ధులపైకి ప్రయోగిస్తుంటుంది. ఇందులో భాగంగానే బెంగాల్ ఎన్నికల్లో కూడా పదే పదే హిందుత్వ కార్డును నరేంద్రమోడి, అమిత్, జేపే నడ్డా అండ్ కో మమతాబెనర్జీ పైకి ప్రయోగించింది.

అయితే ఫలితాల తర్వాత చూస్తే ఆ అస్త్రం అట్టర్ ఫ్లాప్ అయినట్లు అర్ధమవుతోంది. తాము ప్రయోగించిన హిందుత్వ అస్త్రం చివరకు తమనే రివర్సులో దెబ్బకొట్టేసిందని ఇఫుడు కమలనాదులకు అర్ధమైంది. మామూలుగా ఎన్నికల్లో డెవలప్మెంట్ అంశాలను కూడా ప్రస్తావిస్తారు. కానీ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏమి చేసింది, చేయబోతోందనే అంశాలను మోడి అండ్ కో పెద్దగా ప్రస్తావించలేదు. ఎంతసేపు ముస్లింలు-హిందువులు, బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి వలసవచ్చిన ముస్లింల అంశం, అవినీతిని మాత్రమే టచ్ చేశారు.

అయితే దీన్ని దీదీ ముందే ఊహించారట. అందుకనే తన కులమేంటి, తన గోత్రమేంటి అనే విషయాలను పదే పదే ప్రస్తావించారు. ప్రతి బహిరంగ వేదికమీద కాళీమాత పారాయణం చేశారు. మంత్రాలను, స్తోత్రాలను పఠించారు. తాను మంత్రాలను చెప్పటమే కాకుండా ఇవే మంత్రాలను మోడి, అమిత్ షాలు చెప్పాలంటు చాలెంజ్ విసిరారు. పక్కా హిందువునైన తనను హిందువ్యతిరేకిగా ముద్రవేయాలని మోడి అండ్ కో చేస్తున్న ప్రయత్నాలను డైరెక్టుగానే చీల్చిచెండాడారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రాలను పఠించటంలో దీదీ చాలెంజ్ ను మోడి, షా ఒక్కసారిగా స్వీకరించలేదు. ఇక్కడే వీళ్ళకు సమస్యలు మొదలయ్యాయట. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి వలసలను నిరోధించాల్సిన కేంద్రం ఆ విషయంలో ఫెయిలై అదే మమత మీదకు నెట్టేస్తోందన్న విషయం జనాలకు బాగా అర్ధమైంది.

ఎన్నికల ప్రచారం జరిగిన దాదాపు రెండు నెలలు కూడా మమతను పదే పదే హిందువ్యతిరేకిగా ముద్ర వేయటానికి మోడి, షా చేసిన ప్రయత్నంతో జనాలకు చిర్రెత్తిందట. దాంతో హిందు-ముస్లిం అన్నతేడా లేకుండా మెజారిటి సెక్షన్లు మమతకే మద్దతుగా నిలబడటంతో అఖండ విజయం సాధ్యమైంది. మొత్తానికి తమ చేతిలోని బ్రహ్మాస్త్రమే తమకు రివర్సు కొట్టిందని ఇపుడు కమలనాదులు విశ్లేషించుకుంటున్నారట.

This post was last modified on May 4, 2021 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 hour ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

5 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

6 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

6 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

7 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

7 hours ago