కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం తొందరలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశాలున్నాయా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, అత్యున్నతస్ధాయి వర్గాల ఆలోచనలు చూస్తుంటే దేశంలో హెల్త్ ఎమర్జీన్సీ విధించే విషయమై కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. నాలుగురోజల క్రితం సుప్రింకోర్టు కూడా దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే విషయమై చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశం మొత్తంమీద కరోనా సమస్య పెరిగిపోతున్నది. దేశంలో గడచిన 24 గంటల్లో 3.5 లక్షల కేసులు నమోదుకాగా సుమారు 2900 మంది చనిపోయారు. చనిపోతున్న వారిలో కరోనా వైరస్ కారణం ఒకటి కాగా మరో కారణం ఆక్సిజన్ అందకపోవటం. కరోనా వైరస్ రోగులకు ఒక్కసారిగా ఆక్సిజన్ అవసరం పెరిగిపోతోంది. పెరిగిపోతున్న ఆక్సిజన్ అవసరాలకు తగ్గట్లుగా కేంద్రం ఉత్పత్తిని పెంచలేకపోతోంది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచటం, పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తిని సరఫరా చేయటం. ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలన్నా, సరఫరా చేయాలన్నా మామూలు విషయంకాదు. ట్యాంకర్లలో మంచినీటిని నింపేసి దూరప్రాంతాలకు పంపేయటం కాదు ఆక్సిజన్ ట్యాంకర్లలో నింపి సరఫరా చేయటమంటే. దీనికి చాలా పెద్ద ప్రహసనం ఉంటుంది. సమస్య వచ్చినంత హఠాత్తుగా పరిష్కారం సాధ్యంకాదు. అందుకనే సెకెండ్ వేవ్ ను ఎదుర్కోవటంలో ప్రభుత్వాలు ఫెయిలవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని విధించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోందట. ఒకవేళ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా లాంటి అత్యవసరాలన్నింటినీ స్ట్రీంలైన్ చేయటానికి అవకాశం ఉంటుంది. నిజానికి ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోనిదే. కానీ ఇపుడు కరోనా వైరస్ అన్నదే జాతీయ సమస్య కాబట్టి కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించటం తప్ప మరోదారిలేదని అంటున్నారు. మరి ప్రధానమంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on April 27, 2021 10:06 am
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…