తాజాగా ఏపీ సర్కారు ఒక ఎత్తిపోతల పథకాన్ని షురూ చేయటం.. దీనికి సంబంధించిన జీవో జారీ కావటం తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తెలంగాణ హక్కులు భంగం వాటిల్లే ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల పథకంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలకు చెల్లుచీటి పడినట్లేనని భావించిన దానికి భిన్నమైన పరిస్థితి తాజాగా నెలకొంది. ఏపీ చేపట్టబోయే ఎత్తిపోతల పథకం తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోపం తెప్పిస్తే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు కుట్ర కోణం కనిపించింది.
జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని హరీశ్ వాదిస్తున్నారు. 805 అడుగుల స్థాయిలో లిఫ్టు పెడుతున్నారంటే.. తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్లేనని చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం దారుణమని ఆయన మండిపడుతున్నారు.
పోతిరెడ్డిపాటు సామర్థ్యంపై తాము నేటికి పోరాడుతూనే ఉన్నామని.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై గతంలోనే తాను క్రిష్ణా బోర్డుకు కంప్లైంట్ చేశామన్నారు. తాజాగా చేపట్టిన ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఏపీ సర్కారుపై ముఖ్యమంత్రికి కోపం వస్తే.. మంత్రి హరీశ్ కు మాత్రం కుట్ర కోణం కనిపించటం గమనార్హం.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…