ఊర్వశి రౌటలా.. ఏమంత పెద్ద హీరోయిన్ కాదు. బాలీవుడ్లో చిన్నా చితకా పాత్రలే చేసింది. ఎక్కువగా ఐటెం సాంగ్స్తో పాపులర్ అయింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి చాలా పాపులరే. హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు వెర్రెత్తిస్తుంది. ఐతే కథానాయికగా ఆమె స్థాయి చాలా తక్కువైనా.. కరోనా బాధితుల కోసం ఆమె చాలా పెద్ద సాయమే చేసింది.
కోవిడ్-19 బాధితుల ఏకంగా రూ.5 కోట్ల విరాళాన్ని ఊర్వశి అందజేసి షాకిచ్చింది. సోషల్ మీడియాలో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ భామ.. టిక్ టాక్లో మాస్టర్ డ్యాన్స్ క్లాస్ పేరుతో ఓ ఆన్ లైన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనికి 18 మిలియన్ల మంది కనెక్టయ్యారు. తద్వారా రూ.5 కోట్ల మొత్తం పోగైంది. ఆ మొత్తాన్ని ఆమె ప్రభుత్వానికి అందజేసింది.
కరోనా పోరులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు కానీ.. హీరోయిన్ల నుంచి పెద్దగా స్పందన లేకపోయింది. కోట్లల్లో అయితే ఎవరూ విరాళాలు అందజేసినట్లు వార్తలు రాలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇదే వరస. కొందరు కొన్ని లక్షల మేర విరాళాలు అందజేశారు. వేరే సహాయ కార్యక్రమాలేవో చేశారు. కానీ ఊర్వశి లాంటి చిన్న కథానాయికగా ఏకంగా రూ.5 కోట్ల విరాళం ఇవ్వడం అసాధారణమైన విషయం. ఈ విషయంలో తనకు సహకారం అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
కథానాయికగా పెద్ద రేంజ్ లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు ఏకంగా రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లుండటం విశేషం. ట్విట్టర్, ఫేస్బుక్ల్లోనూ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఎండోర్స్మెంట్లతో ఊర్వశి బాగానే ఆర్జిస్తోంది. ఆమె ఒక పోస్ట్ పెడితే కోట్లమందికి చేరుతుందంటే ఎండోర్స్మెంట్లకు ఢోకా ఏముంటుంది?
This post was last modified on May 13, 2020 11:44 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…