ఊర్వశి రౌటలా.. ఏమంత పెద్ద హీరోయిన్ కాదు. బాలీవుడ్లో చిన్నా చితకా పాత్రలే చేసింది. ఎక్కువగా ఐటెం సాంగ్స్తో పాపులర్ అయింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి చాలా పాపులరే. హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు వెర్రెత్తిస్తుంది. ఐతే కథానాయికగా ఆమె స్థాయి చాలా తక్కువైనా.. కరోనా బాధితుల కోసం ఆమె చాలా పెద్ద సాయమే చేసింది.
కోవిడ్-19 బాధితుల ఏకంగా రూ.5 కోట్ల విరాళాన్ని ఊర్వశి అందజేసి షాకిచ్చింది. సోషల్ మీడియాలో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ భామ.. టిక్ టాక్లో మాస్టర్ డ్యాన్స్ క్లాస్ పేరుతో ఓ ఆన్ లైన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనికి 18 మిలియన్ల మంది కనెక్టయ్యారు. తద్వారా రూ.5 కోట్ల మొత్తం పోగైంది. ఆ మొత్తాన్ని ఆమె ప్రభుత్వానికి అందజేసింది.
కరోనా పోరులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు కానీ.. హీరోయిన్ల నుంచి పెద్దగా స్పందన లేకపోయింది. కోట్లల్లో అయితే ఎవరూ విరాళాలు అందజేసినట్లు వార్తలు రాలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇదే వరస. కొందరు కొన్ని లక్షల మేర విరాళాలు అందజేశారు. వేరే సహాయ కార్యక్రమాలేవో చేశారు. కానీ ఊర్వశి లాంటి చిన్న కథానాయికగా ఏకంగా రూ.5 కోట్ల విరాళం ఇవ్వడం అసాధారణమైన విషయం. ఈ విషయంలో తనకు సహకారం అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
కథానాయికగా పెద్ద రేంజ్ లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు ఏకంగా రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లుండటం విశేషం. ట్విట్టర్, ఫేస్బుక్ల్లోనూ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఎండోర్స్మెంట్లతో ఊర్వశి బాగానే ఆర్జిస్తోంది. ఆమె ఒక పోస్ట్ పెడితే కోట్లమందికి చేరుతుందంటే ఎండోర్స్మెంట్లకు ఢోకా ఏముంటుంది?
This post was last modified on May 13, 2020 11:44 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…