ఊర్వశి రౌటలా.. ఏమంత పెద్ద హీరోయిన్ కాదు. బాలీవుడ్లో చిన్నా చితకా పాత్రలే చేసింది. ఎక్కువగా ఐటెం సాంగ్స్తో పాపులర్ అయింది. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి చాలా పాపులరే. హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్లకు వెర్రెత్తిస్తుంది. ఐతే కథానాయికగా ఆమె స్థాయి చాలా తక్కువైనా.. కరోనా బాధితుల కోసం ఆమె చాలా పెద్ద సాయమే చేసింది.
కోవిడ్-19 బాధితుల ఏకంగా రూ.5 కోట్ల విరాళాన్ని ఊర్వశి అందజేసి షాకిచ్చింది. సోషల్ మీడియాలో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ భామ.. టిక్ టాక్లో మాస్టర్ డ్యాన్స్ క్లాస్ పేరుతో ఓ ఆన్ లైన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనికి 18 మిలియన్ల మంది కనెక్టయ్యారు. తద్వారా రూ.5 కోట్ల మొత్తం పోగైంది. ఆ మొత్తాన్ని ఆమె ప్రభుత్వానికి అందజేసింది.
కరోనా పోరులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు భారీగా విరాళాలు ప్రకటించారు కానీ.. హీరోయిన్ల నుంచి పెద్దగా స్పందన లేకపోయింది. కోట్లల్లో అయితే ఎవరూ విరాళాలు అందజేసినట్లు వార్తలు రాలేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ఇదే వరస. కొందరు కొన్ని లక్షల మేర విరాళాలు అందజేశారు. వేరే సహాయ కార్యక్రమాలేవో చేశారు. కానీ ఊర్వశి లాంటి చిన్న కథానాయికగా ఏకంగా రూ.5 కోట్ల విరాళం ఇవ్వడం అసాధారణమైన విషయం. ఈ విషయంలో తనకు సహకారం అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
కథానాయికగా పెద్ద రేంజ్ లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు ఏకంగా రెండున్నర కోట్ల మంది ఫాలోవర్లుండటం విశేషం. ట్విట్టర్, ఫేస్బుక్ల్లోనూ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఎండోర్స్మెంట్లతో ఊర్వశి బాగానే ఆర్జిస్తోంది. ఆమె ఒక పోస్ట్ పెడితే కోట్లమందికి చేరుతుందంటే ఎండోర్స్మెంట్లకు ఢోకా ఏముంటుంది?
This post was last modified on May 13, 2020 11:44 am
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…