Political News

ఏపీ స‌ర్కారుకు ముప్పు.. అంద‌రినోటా.. ఇదే మాట…‌!

ఏపీ స‌ర్కారు అనిశ్చితిలో ప‌డింద‌నే వాద‌న వ‌స్తోంది. ఆర్థికంగా ఒక‌వైపు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న జ‌గ‌న్ స‌ర్కారుకు ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ భారీగా త‌గిలింద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ‌స్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిప‌దిక‌న‌.. రంగంలోకి దిగి ప్ర‌జ‌లకు సేవ చేసింది. అయితే.. ఇప్పుడు క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి భారీ ఎత్తున కొన‌సాగుతోంది. దీంతో.. ప్ర‌భుత్వం ఇరుకున‌పడుతోంది. ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం కూడా చేతులు ఎత్తేసిన ప‌రిస్థితి క‌నిపించింది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా క‌రోనా భారిన ప‌డి.. మృతి చెందుతున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి.

ఒకే రోజు న‌లుగురు స‌చివాల‌య అధికారులు మృతి చెంద‌డం.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగా మారింది. దీంతో స‌చివాల‌యాన్ని మూసివేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు భ‌రోసా కావాల‌ని.. ఉద్యోగులు రోడ్డెక్కారు. త‌మ‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, న‌లుగురు మృతి చెంద‌డంతో ఉద్యోగులు హ‌డ‌లి పోతున్నారు. అంతేకాదు.. విధుల‌కు రాలేమ‌ని ఖ‌రాకండీగా చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారుకు సంక‌ట స్థితి ఏర్ప‌డింది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. ప్ర‌భుత్వ యంత్రాంగం కూడా కుప్ప‌కూలుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీలకులు.

తాజాగా సీఎం జ‌గ‌న్‌.. చేసిన స‌మీక్ష‌లో ఇదే విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే.. ఇంటి నుంచి ప‌నిచేసుకునే వెసులుబాటు ఇవ్వాల‌ని కొంద‌రు ఉన్న‌తాధికారులు కోరినా.. సీఎం జ‌గ‌న్ దీనిని లైట్ తీసుకున్న‌ట్టు ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. దీంతో కొంద‌రు అన‌ధికార సెల‌వులు పెడుతున్నారు. మ‌రికొంద‌రు హైద‌రాబాద్‌లో ఇళ్ల నుంచి క‌నీసం బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తో ఉన్న‌వారిపైనే ఎక్కువగా భారం ప‌డుతోంద‌నే వాద‌న వ‌స్తోంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనా ఇది ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే.. వ‌రుస‌గా రెండో ఏడాది కూడా జ‌గ‌న్ స‌ర్కారుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 20, 2021 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

33 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

35 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

1 hour ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago