Political News

విజయసాయి గారూ.. ఇదేం సంస్కారం?


రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒక పార్టీ అధినేత పుట్టిన రోజు లాంటి సందర్భం వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఇది ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమే. రాజకీయాలు ఎంతగా దిగజారినప్పటికీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం నాయకులు హుందాగానే ప్రవర్తిస్తారు. అవతలి పార్టీ నేత మీద లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. బయటికి మాత్రం మర్యాదపూర్వకంగానే శుభాకాంక్షలు చెబుతుంటారు. ఒకవేళ శుభాకాంక్షలు చెప్పడం ఇష్టం లేకుంటే సైలెంటుగా ఉండిపోవచ్చు కానీ.. కించపరిచేలా మాత్రం వ్యాఖ్యలు చేయరు. ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ముఖ్య నేత అయిన విజయసాయి రెడ్డికి మాత్రం ఇలాంటి పట్టింపులేమీ ఉండవు.

ఒక ఎంపీ అయి ఉండి ఆయన ట్విట్టర్లో పెట్టే పోస్టులు చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఊరూ పేరూ లేని అనామకుల తరహాలో దిగజారుడు పోస్టులు పెడుతుంటారాయన. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గరు. తాజాగా మంగళవారం ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన పెట్టిన పోస్టు చూస్తే విజయ సాయి ఎప్పటికీ మారరు అని స్పష్టమవుతుంది. 420 అనే నంబరులో చంద్రబాబు ఫొటోలు పెట్టి గ్రాఫిక్ చేయించి.. “ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత ‘పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని’ ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ బ్రీఫ్ డు అవసరం లేదు” అంటూ వ్యాఖ్య జోడించారు విజయసాయి.

చంద్రబాబు మీద ఎంత ద్వేషం ఉన్నా సరే.. పుట్టిన రోజు నాడు ఒక ఎంపీ ఇలాంటి పోస్ట్ పెట్టడం దారుణం. ఈయన ఇలా ఉంటే.. జగన్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు హుందాగానే చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. విజయసాయి స్వయంగా ఇలాంటి పోస్టులు పెడతారో.. ఎవరితోనైనా పెట్టిస్తారో కానీ.. తాను ఒక ఎంపీ అని మరిచిపోయి మరీ ఇంత దిగజారుడు పోస్టులు పెట్టడం వల్ల జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో జగన్ అండ్ కో ఆలోచించాల్సిందే.

This post was last modified on April 20, 2021 5:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago