రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ.. ఒక పార్టీ అధినేత పుట్టిన రోజు లాంటి సందర్భం వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఇది ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయమే. రాజకీయాలు ఎంతగా దిగజారినప్పటికీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం నాయకులు హుందాగానే ప్రవర్తిస్తారు. అవతలి పార్టీ నేత మీద లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ.. బయటికి మాత్రం మర్యాదపూర్వకంగానే శుభాకాంక్షలు చెబుతుంటారు. ఒకవేళ శుభాకాంక్షలు చెప్పడం ఇష్టం లేకుంటే సైలెంటుగా ఉండిపోవచ్చు కానీ.. కించపరిచేలా మాత్రం వ్యాఖ్యలు చేయరు. ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ముఖ్య నేత అయిన విజయసాయి రెడ్డికి మాత్రం ఇలాంటి పట్టింపులేమీ ఉండవు.
ఒక ఎంపీ అయి ఉండి ఆయన ట్విట్టర్లో పెట్టే పోస్టులు చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఊరూ పేరూ లేని అనామకుల తరహాలో దిగజారుడు పోస్టులు పెడుతుంటారాయన. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గరు. తాజాగా మంగళవారం ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన పెట్టిన పోస్టు చూస్తే విజయ సాయి ఎప్పటికీ మారరు అని స్పష్టమవుతుంది. 420 అనే నంబరులో చంద్రబాబు ఫొటోలు పెట్టి గ్రాఫిక్ చేయించి.. “ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత ‘పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని’ ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ బ్రీఫ్ డు అవసరం లేదు” అంటూ వ్యాఖ్య జోడించారు విజయసాయి.
చంద్రబాబు మీద ఎంత ద్వేషం ఉన్నా సరే.. పుట్టిన రోజు నాడు ఒక ఎంపీ ఇలాంటి పోస్ట్ పెట్టడం దారుణం. ఈయన ఇలా ఉంటే.. జగన్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు హుందాగానే చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. విజయసాయి స్వయంగా ఇలాంటి పోస్టులు పెడతారో.. ఎవరితోనైనా పెట్టిస్తారో కానీ.. తాను ఒక ఎంపీ అని మరిచిపోయి మరీ ఇంత దిగజారుడు పోస్టులు పెట్టడం వల్ల జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో జగన్ అండ్ కో ఆలోచించాల్సిందే.
This post was last modified on April 20, 2021 5:30 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…