తమ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తికి బంపర్ మెజారిటి వస్తుందని వైసీపీ నేతలు చాలా నమ్మకంతో ఉన్నారు. అధికారపార్టీ నేతల నమ్మకానికి తగిన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే చాలా తక్కువగా అంటే 50 శాతం ఓటింగ్ జరిగింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి, వెంకటగిరి, సర్వేపల్లి ఓపెన్ క్యాటగిరి నియోజకవర్గాలు. సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరు రిజర్వుడు నియోజకవర్గాలు.
ఓసీ నియోజకవర్గాల్లో సగటు ఓటింగ్ 69 శాతం నమోదైంది. ఇదే సమయంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో సగుటు ఓటింగ్ 71గా నమోదైంది. ఎస్సీ నియోజకవర్గాల్లో భారీగా నమోదైన ఓటింగ్ వల్లే తమ అభ్యర్ధి మంచి మెజారిటి గెలవబోతున్నట్లు వైసీపీ నేతలు చాలా ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా తమకు ఏకపక్షంగా ఓటింగ్ జరిగినట్లు వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లోనే వైసీపీకి సుమారు 1.5 లక్షల ఓట్ల మెజారిటి వచ్చింది. కాబట్టి అదే పద్దతిలో ఇపుడు కూడా ఈ మూడు నియోజకవర్గాల్లోనే సుమారు 2 లక్షల మెజారిటి అంచనా వేస్తున్నారు. వివిధ కారణాల వల్ల తిరుపతి అసెంబ్లీపై మొదటినుండి వైసీపీ నేతల అంచనాలు కాస్త అయోమయంగానే ఉంది. 2019 ఎన్నికల్లో కూడా తిరుపతిలో వైసీపీ 3500 ఓట్లు మైనస్ వచ్చింది.
అయితే ఈమధ్యనే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వైసీపీ దాదాపు స్వీప్ చేసింది. అయితే అదే మ్యాజిక్ ఇపుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నదే చెప్పలేకున్నారు. దానికితోడు పోలింగ్ శాతం 50కి వచ్చి ఆగిపోవటంతో అధికారపార్టీ నేతల్లో అయోమయం మరింత పెరిగిపోయింది. మొత్తానికి నేతల మాటలు చూస్తుంటే మెజారిటి నుండి తిరుపతిని మినహాయించినట్లే ఉంది. పైగా మూడు ఎస్సీ నియోజకవర్గాలపైనే బాగా హోప్స్ పెట్టుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on April 20, 2021 11:15 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…