తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ ఎన్నికల డ్రీమ్ కేబినెట్ను ఏర్పాటు చేసుకుని ఈ రెండేళ్లు ప్రజల్లో మరింత స్ట్రాంగ్ అయ్యి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. కేటీఆర్ను సీఎం చేస్తారంటూ వస్తోన్న వార్తలకు ఆయన పూర్తిగా చెక్ పెట్టేసి.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తాను హ్యాట్రిక్ కొట్టి మరోసారి తెలంగాణ సీఎం అవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయారు. కేటీఆర్ సీఎం అంటే అనేకానేక పుకార్లు, సందేహాలు వస్తున్నాయి. వీటికి తావు ఇవ్వకూడదని కేసీఆరే ఇటీవల పలు ఆపరేషన్లలో రంగంలోకి దిగిపోతున్నారు.
తెలంగాణలో 2018 డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మళ్లీ వచ్చే లోక్సభ ఎన్నికల కంటే ముందుగానే 2023లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో వరుసగా ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది. అక్కడ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. పార్టీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. అయితే పదవులు మాత్రం కొద్ది మందికే దక్కాయి. అక్కడ మంత్రి పదవి ఆశిస్తోన్న సీనియర్ ఎమ్మెల్యేల లిస్ట్ చాలానే ఉంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది నేతలకు పదవులు కల్పించలేదు.
ఇక ఇప్పుడు కేబినెట్ను సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడంతో పాటు ఎన్నికల డ్రీమ్ కేబినెట్గా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కేబినెట్లో కొందరి పదవులు ఊస్ట్ కావడం ఖాయమనే అంటున్నారు. ఇప్పుడున్న కేబినెట్లో కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదు నుంచి ఆరుగురు మంత్రులను తప్పించేస్తారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల పట్ల కూడా ఆయన సంతృప్తిగా లేరు. ఈ లెక్కన చూస్తే గ్రేటర్ పరిధిలో మంత్రులతో పాటు ఉత్తర తెలంగాణలో పనితీరు సరిగా లేని మంత్రులపై ఈ సారి వేటు ఖాయమని తెలుస్తోంది.
ఇక ఈ సారి కేబినెట్లోకి తీసుకునే వారిలో సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారని చెపుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది. ఇక ఎలాగూ గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు ఐదు మున్సిపాల్టీల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒకేసారి కేబినెట్లో ప్రక్షాళన చేసుకుని.. ఆ టీంతోనే ఆయన 2023 ఎన్నికలకు రెడీ కానున్నారు.
This post was last modified on April 19, 2021 2:58 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…