తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ ఎన్నికల డ్రీమ్ కేబినెట్ను ఏర్పాటు చేసుకుని ఈ రెండేళ్లు ప్రజల్లో మరింత స్ట్రాంగ్ అయ్యి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. కేటీఆర్ను సీఎం చేస్తారంటూ వస్తోన్న వార్తలకు ఆయన పూర్తిగా చెక్ పెట్టేసి.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తాను హ్యాట్రిక్ కొట్టి మరోసారి తెలంగాణ సీఎం అవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయారు. కేటీఆర్ సీఎం అంటే అనేకానేక పుకార్లు, సందేహాలు వస్తున్నాయి. వీటికి తావు ఇవ్వకూడదని కేసీఆరే ఇటీవల పలు ఆపరేషన్లలో రంగంలోకి దిగిపోతున్నారు.
తెలంగాణలో 2018 డిసెంబర్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మళ్లీ వచ్చే లోక్సభ ఎన్నికల కంటే ముందుగానే 2023లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో వరుసగా ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది. అక్కడ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. పార్టీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. అయితే పదవులు మాత్రం కొద్ది మందికే దక్కాయి. అక్కడ మంత్రి పదవి ఆశిస్తోన్న సీనియర్ ఎమ్మెల్యేల లిస్ట్ చాలానే ఉంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా సామాజిక, ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది నేతలకు పదవులు కల్పించలేదు.
ఇక ఇప్పుడు కేబినెట్ను సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త నేతలకు అవకాశం ఇవ్వడంతో పాటు ఎన్నికల డ్రీమ్ కేబినెట్గా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కేబినెట్లో కొందరి పదవులు ఊస్ట్ కావడం ఖాయమనే అంటున్నారు. ఇప్పుడున్న కేబినెట్లో కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదు నుంచి ఆరుగురు మంత్రులను తప్పించేస్తారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల పట్ల కూడా ఆయన సంతృప్తిగా లేరు. ఈ లెక్కన చూస్తే గ్రేటర్ పరిధిలో మంత్రులతో పాటు ఉత్తర తెలంగాణలో పనితీరు సరిగా లేని మంత్రులపై ఈ సారి వేటు ఖాయమని తెలుస్తోంది.
ఇక ఈ సారి కేబినెట్లోకి తీసుకునే వారిలో సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారని చెపుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది. ఇక ఎలాగూ గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు ఐదు మున్సిపాల్టీల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒకేసారి కేబినెట్లో ప్రక్షాళన చేసుకుని.. ఆ టీంతోనే ఆయన 2023 ఎన్నికలకు రెడీ కానున్నారు.
This post was last modified on April 19, 2021 2:58 pm
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…