“కష్టపడేవాళ్లను వెతికి పట్టుకుని మరీ గుర్తింపు ఇస్తాను. ఎవరు కష్టపడుతున్నారో.. ఎవరు పార్టీ కోసం శ్రమి స్తున్నారో.. నాకు అన్నీ తెలుసు!“- ఇదీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు టీడీపీ నేతలను ఉద్దేశించి చెప్పిన మాట. సో.. తిరుపతి ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. పార్టీని ప్రక్షాళన మాత్రం చేస్తా రనే విషయం ఈ వ్యాఖ్యలను బట్టి స్పష్టమైంది. అయితే.. ఇక్కడే ఉంది అసలు చిక్కంతా అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికలు పూర్తయ్యాక.. ఆ ఎన్నికల్లో సత్తా చాటని వారిని పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇస్తానని.. చంద్రబాబు చెప్పారు.
అయితే.. పాత వారిని మాత్రం పక్కన పెట్టకుండా.. కొత్త పదవులు సృష్టించి.. కొత్తవారికి అవకాశం అయితే.. ఇచ్చారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్లు, మండల స్థాయి ఇంచార్జ్లు.. మహిళా పార్లమెం టరీ నేతలు.. తెలుగు మహిళ(పాతదే)లోనూ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నప్ప టికీ.. ఈ కొత్తవారికి ఎక్కడా అధికారం అప్పగించలేదు. మళ్లీ పాత నేతలు, కురువృద్ధుల ఐడియాలనే పాటించాలని.. వారి కనుసన్నల్లోనే ముందుకు సాగాలని పైనుంచి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీనికితోడు.. కొందరిని పక్కన పెట్టినా.. వారికి ఉన్న హవాను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఈ ప్రయోగం వికటించిందనేది వాస్తవం.
ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఈ పరిణామం నిశితంగా గమనించిన చంద్రబాబు.. తిరుపతిలో అందరినీ కలుపుకొనిపోయేందుకు బాగానే ప్రయత్నించారు. కానీ, ఇతర ప్రాం తాల నుంచి నేతలు(వీరిలో కురువృద్ధులు కూడా ఉన్నారు) వచ్చారే తప్ప.. స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం.. ముందుకు రాలేదు. దీంతో తిరుపతిలో పోరు ఒంటి చేత్తో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈక్రమంలోనే చంద్రబాబు మళ్లీ ప్రక్షాళన బాట పట్టారు. పార్టీని ప్రక్షాళన చేస్తానని.. కష్టపడుతున్నవారిని వెతికి పట్టుకుని మరీ పదవులు ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఎన్నిసార్లు ప్రక్షాళన చేస్తారు? అనేది ఓ వర్గం తమ్ముళ్ల వాదన.
ప్రక్షాళన ముఖ్యమే అయినా.. ప్రధానంగా పనిచేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని.. అధికారం అప్పగించా లని అంటున్నారు. జెండా పట్టుకోవాలన్నా.. జెండా దింపాలన్నా.. కొందరి అనుమతి ఉండాల్సి వస్తోంద న్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన అంటే.. వ్యక్తులను అటు ఇటు మార్చడం కాకుండా.. ఎవరు ఏ స్థాయి వారైనా పార్టీ కోసం నిలబడితే.. టికెట్ ఖాయం.. అనే విధంగా సమూల మార్పులు తెస్తే.. తప్ప టీడీపీలో ఊపు రాదని కుండబద్దలు కొడుతుండడం గమనార్హం. మరి ఇలా సంచలన నిర్ణయం తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఇలా చేస్తే.. సీనియర్లు(కురువృద్ధులు) ఊరుకుంటారా? మిలియన్ డాలర్ల ప్రశ్న.. తెరమీద కనిపిస్తూనే ఉంది.
This post was last modified on April 19, 2021 6:49 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…