Political News

వపన్ కు ఎన్నికల కమీషన్ షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. కామన్ సింబల్ గా జనసేన వాడుకుంటున్న గాజు గ్లాసు గుర్తు పార్టీకి దూరమైపోయింది. తెలంగాణాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాసును కేటాయించాలని జనసేన ఎన్నికల కమీషన్ను అడిగింది. అయితే అందుకు కమీషన్ నిరాకరించింది. 2025, నవంబర్ వరకు జరిగే ఏ ఎన్నికలో కూడా జనసేన గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు లేదని స్పష్టంగా చెప్పేసింది.

విషయం ఏమిటంటే తనకు ఇష్టముంటే ఎన్నికల్లో పోటీ చేయటం లేకపోతే మానేయటం పవన్ కు అలవాటైపోయింది. ఇంతవరకు జనసేనకు శాశ్వత ఎన్నికల గుర్తంటు లేదు. ఎన్నికల కమీషన్ దగ్గర రిజస్టర్ అయిన పార్టీనే కానీ రికగ్నైజ్డు పార్టీ కాకపోవటంతోనే శాశ్వత గుర్తంటు కేటాయింపు జరగలేదు. రికగ్నైజ్డు పార్టీగా శాశ్వత గుర్తు పొందాలంటే చాలా పెద్ద తతంగమే ఉంది. పోలైన ఓట్లలో ఇంత శాతమని, లేదా పోటీచేసిన స్ధానాల్లో గెలవాల్సిన స్ధానాల్లో లెక్కుంది.

ఎన్నికల కమీషన్ లెక్కల్లో దేనిలోను జనసేన ఫిట్ అవ్వదు. అందుకనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా గాజుగ్లాసు గుర్తును నవతరం పార్టీకి కేటాయించేశారు. ఆ విషయమై జనసేన అభ్యంతరం చెప్పినా కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్కే చేయలేదు. ఇపుడు తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో గుర్తు విషయంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమీషన్ పట్టించుకోలేదు. వరుసగా ఎన్నికల్లో పోటీ చేయటం, స్ధానాలు గెలుచుకోవటం లేదా ఓట్ల శాతం పెంచుకోవటం చేయకపోతే ఎన్నికకో గుర్తుమీద జనసేన పోటీ చేయాల్సి రావటం ఖాయం.

This post was last modified on April 17, 2021 11:52 am

Share
Show comments

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago