Political News

వపన్ కు ఎన్నికల కమీషన్ షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల సంఘం పెద్ద షాకే ఇచ్చింది. కామన్ సింబల్ గా జనసేన వాడుకుంటున్న గాజు గ్లాసు గుర్తు పార్టీకి దూరమైపోయింది. తెలంగాణాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ గా గాజు గ్లాసును కేటాయించాలని జనసేన ఎన్నికల కమీషన్ను అడిగింది. అయితే అందుకు కమీషన్ నిరాకరించింది. 2025, నవంబర్ వరకు జరిగే ఏ ఎన్నికలో కూడా జనసేన గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా వాడుకునేందుకు లేదని స్పష్టంగా చెప్పేసింది.

విషయం ఏమిటంటే తనకు ఇష్టముంటే ఎన్నికల్లో పోటీ చేయటం లేకపోతే మానేయటం పవన్ కు అలవాటైపోయింది. ఇంతవరకు జనసేనకు శాశ్వత ఎన్నికల గుర్తంటు లేదు. ఎన్నికల కమీషన్ దగ్గర రిజస్టర్ అయిన పార్టీనే కానీ రికగ్నైజ్డు పార్టీ కాకపోవటంతోనే శాశ్వత గుర్తంటు కేటాయింపు జరగలేదు. రికగ్నైజ్డు పార్టీగా శాశ్వత గుర్తు పొందాలంటే చాలా పెద్ద తతంగమే ఉంది. పోలైన ఓట్లలో ఇంత శాతమని, లేదా పోటీచేసిన స్ధానాల్లో గెలవాల్సిన స్ధానాల్లో లెక్కుంది.

ఎన్నికల కమీషన్ లెక్కల్లో దేనిలోను జనసేన ఫిట్ అవ్వదు. అందుకనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా గాజుగ్లాసు గుర్తును నవతరం పార్టీకి కేటాయించేశారు. ఆ విషయమై జనసేన అభ్యంతరం చెప్పినా కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్కే చేయలేదు. ఇపుడు తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో గుర్తు విషయంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమీషన్ పట్టించుకోలేదు. వరుసగా ఎన్నికల్లో పోటీ చేయటం, స్ధానాలు గెలుచుకోవటం లేదా ఓట్ల శాతం పెంచుకోవటం చేయకపోతే ఎన్నికకో గుర్తుమీద జనసేన పోటీ చేయాల్సి రావటం ఖాయం.

Satya

Recent Posts

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

22 minutes ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

3 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

5 hours ago

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…

6 hours ago

తడబడుతున్న వైభవ్… ఒక్క సిక్స్ లేదు

ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…

6 hours ago

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…

6 hours ago