ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా కీలకం. ముఖ్యంగా టయర్ 2 హీరోలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిఖిల్ స్వయంభు ముందు అనుకున్న ప్రకారమైతే ఏప్రిల్ 10 విడుదల కావాలి. కానీ ఇప్పుడు దాన్ని మార్చుకుని ఏప్రిల్ 17 షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు యూనిట్ టాక్.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిన మాట వాస్తవమే కానీ వాటిని ఇంకా పూర్తి స్థాయిలో పెంచాల్సిన బాధ్యత టీమ్ మీద ఉంది. ఎందుకంటే ఏప్రిల్ లో అడివి శేష్ ‘డెకాయిట్’ ఉంది. దానికన్నా ముందు శర్వానంద్ ‘బైకర్’ వస్తుంది. వీటి పబ్లిసిటీతో మొదటి రెండు వారాలు హోరెత్తిపోతాయి. పాజిటివ్ టాక్స్ వస్తే సోషల్ మీడియా మద్దతు ఉంటుంది.
సో స్వయంభు సౌండ్ చేయాలంటే వాటికి ధీటుగా ప్రచారాలు తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ట్రైలర్ మీద దృష్టి సారించాలి. బాహుబలి పోలికల గురించి టీజర్ టైంలో చర్చ జరిగింది. అలాంటి ఫీలింగ్ కలగని విజువల్స్ ని పొందుపరచాలి. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారమైతే స్వయంభులో స్టన్నింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయని, సరైన రీతిలో కనక వాటిని జనాలకు రిజిస్టర్ చేయగలిగితే ఫ్యామిలీస్ తోనే ఓపెనింగ్స్ వచ్చేస్తాయని అంటున్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభులో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 30 పెద్ది వస్తుంది కనక అంతకన్నా ముందే స్వయంభు వచ్చేయడం సేఫ్ అవుతుంది. రెండు వారాల స్పేస్ నిఖిల్ కు సరిపోతుంది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే పెద్ది ఉన్నా సరే చెప్పుకొదగ్గ సంఖ్యలో స్క్రీన్లను కొనసాగించవచ్చు. వార్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన స్వయంభులో యుద్ధవీరుడిగా నిఖిల్ రిస్కీ స్టంట్లు చాలానే చేశాడు.
This post was last modified on March 17, 2026 12:29 pm
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న…
ఫిబ్రవరి 28: ప్రపంచం నిద్రలేచి కళ్లు నలుముకుంటున్న సమయం.. ఇంతలో ఏ టీవీ పెట్టినా.. ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఇరాన్పై…
బలవంతుడు బలవంతుడే అన్నట్టు.. రాజకీయం.. రాజకీయమే!. ఈ మాట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి…
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…