Political News

తిరుప‌తిలో బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటా ?


తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. అయితే ఇదే సీటు నుంచి ముందు జ‌న‌సేన పోటీ చేయాల‌ని అనుకున్నా.. చివ‌ర‌కు బీజేపీ ఒత్తిడికి త‌లొగ్గి సీటును త్యాగం చేయ‌క త‌ప్ప‌లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డానికి ముందు ప‌వ‌న్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించారు కూడా… అయినా చివ‌ర‌కు బీజేపీయే ప‌ట్టుబ‌ట్టి మ‌రి ఈ సీటు ద‌క్కించుకుంది.

తెలంగాణ‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ చివ‌రి వ‌ర‌కు పోటీ చేస్తాన‌ని ఊగిస‌లాడిన జ‌న‌సేన చివ‌ర‌కు పోటీ నుంచి త‌ప్పుకుని.. బీజేపీ నేత‌ల‌తో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని మ‌రీ బీజేపీకే స‌పోర్ట్ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోవ‌డం కూడా బీజేపీకి చాలా ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి. తిరుప‌తిలో ప‌వ‌న్ సీటు త్యాగం చేసినందుకు గాను.. ఇక్క‌డ బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే ఆలోచ‌న‌లో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ లేదా లోక్‌స‌భ సీటు కూడా లేదు.

ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే.. త‌మ‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. ఇక్క‌డ ర‌త్న‌ప్ర‌భ గెలిస్తే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న ప్ర‌చారం ఉప ఎన్నిక‌ల నోటిపికేష‌న్‌కు ముందు భారీగా జ‌రిగింది. ఇప్పుడు అది కాస్త సైలెంట్ అవ్వ‌గా.. ప‌వన్‌కు రాజ్య‌స‌భ సీటు ప్ర‌తిపాదన‌ బాగా హైలెట్ అవుతోంది. ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే అటు కాపు సామాజిక వ‌ర్గం అంతా బీజేపీకి మ‌రింత ప్ల‌స్ అవ్వ‌డంతో పాటు జ‌న‌సేన కేడ‌ర్ అంతా బీజేపీ ప‌ట్ల సానుకూల ధృక్ప‌థంతో ఉంటుంద‌న్న‌దే బీజేపీ ఆశ‌.

దీనిని క్యాష్ చేసుకునే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన + బీజేపీ కూట‌మి మ‌రింత స్ట్రాంగ్‌గా ఎన్నిక‌ల్లో ఏపీలో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆశ‌. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి వెళితే త‌న‌కు అధికారం వ‌స్తుంద‌న్న ఆశ ఆయ‌న‌కు ఉంది. అందుకే ఇటీవ‌ల ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ సినిమాను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోంద‌న్న వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ అభిమానుల మ‌న‌స్సు దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. అందుకే బీజేపీ ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఎత్తుతో ప‌వ‌న్ త‌మ‌ను వీడిపోకుండా ఉండేలా చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Satya

Recent Posts

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

40 seconds ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

1 hour ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

2 hours ago

వెయ్యి కోట్ల దురంధర్… అక్కడేమో డిజాస్టర్

పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…

3 hours ago

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

4 hours ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

5 hours ago