Political News

తిరుప‌తిలో బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటా ?


తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. అయితే ఇదే సీటు నుంచి ముందు జ‌న‌సేన పోటీ చేయాల‌ని అనుకున్నా.. చివ‌ర‌కు బీజేపీ ఒత్తిడికి త‌లొగ్గి సీటును త్యాగం చేయ‌క త‌ప్ప‌లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డానికి ముందు ప‌వ‌న్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించారు కూడా… అయినా చివ‌ర‌కు బీజేపీయే ప‌ట్టుబ‌ట్టి మ‌రి ఈ సీటు ద‌క్కించుకుంది.

తెలంగాణ‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ చివ‌రి వ‌ర‌కు పోటీ చేస్తాన‌ని ఊగిస‌లాడిన జ‌న‌సేన చివ‌ర‌కు పోటీ నుంచి త‌ప్పుకుని.. బీజేపీ నేత‌ల‌తో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని మ‌రీ బీజేపీకే స‌పోర్ట్ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోవ‌డం కూడా బీజేపీకి చాలా ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి. తిరుప‌తిలో ప‌వ‌న్ సీటు త్యాగం చేసినందుకు గాను.. ఇక్క‌డ బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే ఆలోచ‌న‌లో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ లేదా లోక్‌స‌భ సీటు కూడా లేదు.

ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే.. త‌మ‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. ఇక్క‌డ ర‌త్న‌ప్ర‌భ గెలిస్తే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న ప్ర‌చారం ఉప ఎన్నిక‌ల నోటిపికేష‌న్‌కు ముందు భారీగా జ‌రిగింది. ఇప్పుడు అది కాస్త సైలెంట్ అవ్వ‌గా.. ప‌వన్‌కు రాజ్య‌స‌భ సీటు ప్ర‌తిపాదన‌ బాగా హైలెట్ అవుతోంది. ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే అటు కాపు సామాజిక వ‌ర్గం అంతా బీజేపీకి మ‌రింత ప్ల‌స్ అవ్వ‌డంతో పాటు జ‌న‌సేన కేడ‌ర్ అంతా బీజేపీ ప‌ట్ల సానుకూల ధృక్ప‌థంతో ఉంటుంద‌న్న‌దే బీజేపీ ఆశ‌.

దీనిని క్యాష్ చేసుకునే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన + బీజేపీ కూట‌మి మ‌రింత స్ట్రాంగ్‌గా ఎన్నిక‌ల్లో ఏపీలో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆశ‌. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి వెళితే త‌న‌కు అధికారం వ‌స్తుంద‌న్న ఆశ ఆయ‌న‌కు ఉంది. అందుకే ఇటీవ‌ల ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ సినిమాను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోంద‌న్న వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ అభిమానుల మ‌న‌స్సు దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. అందుకే బీజేపీ ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఎత్తుతో ప‌వ‌న్ త‌మ‌ను వీడిపోకుండా ఉండేలా చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

This post was last modified on April 14, 2021 1:37 pm

Share
Show comments

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

6 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago