Political News

బెంగాల్ పాలిటిక్స్ సంచ‌ల‌నం.. మ‌మ‌త నేత‌లు.. బీజేపీ ఏజెంట్లా?!

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో ద‌శల‌వారీ పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. మ‌రో నాలుగు ద‌శ‌లు ఉన్నాయి. అయితే.. తొలి మూడు ద‌శ‌లు పూర్త‌య్యే వ‌ర‌కు బాగానే ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. నాలుగో ద‌శ నుంచి మారుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి న‌మ్మిన‌బంట్లుగా ఉన్న‌వారు.. మ‌మ‌త‌కు కుడి భుజాలుగా ఉన్న‌వారు.. ఆ పార్టీలోనే ఉంటూ.. బీజేపీకి కోవ‌ర్టులుగా మారుతున్నారా? అనేసందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నారు. మారుతున్న ప‌రిస్థితులు… ప‌రిణామాలు.. వీటిని నిజ‌మేన‌ని అనిపించేలా ఉండ‌డం రాజ‌కీయాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీ యాంశంగా మారుతున్నాయి.

నాలుగోద‌శ ఎన్నిక‌ల స‌మ‌యానికి.. మ‌మ‌త‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న‌కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా, వ్యూహ క‌ర్త‌గా ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ యూట‌ర్న్ తీసుకున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ముస్లిం సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న.. మ‌మ‌త‌కు ముస్లింలు దూరంగా ఉన్నార‌ని.. చేసిన వ్యాఖ్య‌ల వీడియో హ‌ల్ చ‌ల్ చేసింది. దీనిని బీజేపీ నేత‌లే బ‌య‌టపెట్ట‌డం మ‌రో చిత్రం. దీంతో.. ఆ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ ప‌రిణామం.. త‌ర్వాత‌.. కూడా పీకే ఎక్క‌డా ఆగ‌లేదు. మోడీని ప్ర‌జానాయకుడు అంటూ సంబోధించారు.

ఈ ప‌రిస్థితి కూడా మ‌మ‌త‌కు తీవ్ర శ‌రాఘాతంగా మారింది. చిత్రం ఏంటంటే.. ఈ రెండు ప‌రిణామాల‌ను బీజేపీ భారీ ఎత్తున త‌న ప్ర‌చారానికి అనుకూలంగా మార్చుకుంది. ఇక‌, తాజాగా మ‌మ‌త‌కు కుడి భుజం అనే.. మ‌హిళా నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్ సుజాతా మండ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు .. ఐదో ద‌శ ఎన్నిక‌ల ముంగిట‌.. మ‌మ‌త‌కు మ‌రింత మంట పెడుతున్నాయి. “ద‌ళితులు బిచ్చ‌గాళ్ల కంటే ఘోరంగా త‌యార‌య్యారు. ప్ర‌భుత్వం ఇస్తున్న పింఛ‌న్లు తీసుకుంటూ.. బీజేపీ ఇస్తున్న డ‌బ్బులు కూడా తీసుకుంటున్నారు” అని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకుని మూడు చోట్ల నిర్వ‌హించిన‌.. ప్ర‌చారంలో మ‌మ‌త ‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇక్క‌డ మ‌రో.. చిత్ర‌మైన ఘ‌ట‌న ఏంటంటే.. ఐదో ద‌శ ఎన్నిక‌లు.. ఎస్సీలు, ద‌ళితులు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌రుగుతున్నాయి. అక్క‌డ ప్ర‌చారం చేసిన మోడీ .. సుజాతా మండ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌మ‌త‌కు ఆపాదిస్తూ.. తృణ‌మూల్ ప‌రువు తీసేశారు. ఈ ప్ర‌భావం ఐదో ద‌శ ఎన్నిక‌ల‌పై తీవ్రంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌మ‌త పెట్టుకున్న ఆశ‌లు ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌ట్టికొట్టుకుపోయాయ‌ని అంటున్నారు. మొత్తానికి అటు పీకే, ఇటు సుజాత మండ‌ల్ కూడా బీజేపీ వ్య‌తిరేక‌మే అయినా.. బీజేపీ వేస్తున్న వ‌ల‌లో చిక్కుకుని.. ఆ పార్టీకి కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించేస్తున్నారా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మ‌రో నాలుగు ద‌శ‌లు మిగిలి ఉన్న ఎన్నిక‌ల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి ఉంటుందో!!

This post was last modified on April 14, 2021 11:40 am

Share
Show comments

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

6 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

9 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

10 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

10 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

11 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

11 hours ago