Political News

చంద్రబాబే అడిగారు- ఏసీబీ ప్రత్యేక కోర్టులో స్టీఫెన్ సన్ ?

రాజకీయ సంచలనంతో పాటు.. పెను పరిణామాలకు మూలమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాము చెప్పిన వారికి ఓటు వేయాలంటూ రూ.50లక్షల డీల్ మాట్లాడిన స్టీఫెన్ సన్.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వటం.. అప్పట్లో రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. తాజా విచారణకు హాజరైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్.. కోర్టుకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారన్నది చూస్తే..

  • టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను ప్రలోభ పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలన్నారు. ఫోన్లో నేరుగా మాట్లాడారు.
  • మనవాళ్లంతా బ్రీఫ్ చేశారు. వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరారు. తానున్నానని వాళ్లు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
  • టీడీపీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్ గా పరిచయం చేసుకున్న సెబాస్టియన్.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎంత డబ్బు కావాలో చెబితే అంత ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని సెబాస్టియన్ వివరించారు.
  • బాబు నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా ఆంథోనీ అనే వ్యక్తి ద్వారా సెబాస్టియన్ నన్ను సంప్రదించారు. బాబు ప్రతినిధిగా పార్టీలో కీలకమైన వ్యక్తి వస్తేనే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పా. దీంతో చంద్రబాబు ప్రతినిధిగా రేవంత్ మాట్లాడటానికి వస్తారని చెప్పారు.
  • లంచం తీసుకోవటం ఇష్టం లేకనే ఏసీబీ అధికారుల్ని సంప్రదించా.
  • ఏసీబీ అధికారులు మేం ఉన్న ప్లాట్ లో ఐఫోన్ ను.. ఇతర ఆడియో.. వీడియో పరికరాల్ని ఏర్పాటు చేశారు. 2015 మే 30న రేవంత్.. సెబాస్టియన్.. ఉదయసింహలు ప్లాట్ కు వచ్చారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామని.. రూ.50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్నట్లు చెప్పి ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఓటింగ్ తర్వాత ఇస్తామన్నారు.
  • బ్యాగును టీపాయి మీద పెట్టిన వెంటనే ఏసీబీ అధికారులు వచ్చి రేవంత్ తదితరుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని పాక్షికంగా నమోదుచేసిన జడ్జి.. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల ఏడుకు వాయిదా వేశారు.

This post was last modified on April 2, 2021 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

7 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

60 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago