తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొన్నటివరకు జనసేనను ఓ పార్టీగాను, అధినేత పవన్ కల్యాణ్ణు రాజకీయ నేతగా కూడా గుర్తించటానికి బీజేపీ నేతలు ఇష్టపడలేదన్నది వాస్తవం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన అధినేతపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అలాంటిది ఇపుడు ఏపి బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో సహా చాలామంది నేతలు పాహిమాం పాహిమాం అంటు పవన్ ముందు సాగిలపడుతున్నారు.
సరే అవసరాలే వారితో అలా చేయిస్తోందని సరిపెట్టుకుందాం. ఎందుకంటే రేపు పవన్ తో ఉపయోగంలేదని అనుకున్న మరుక్షణం వారి డైలాగులు ఎలాగుంటాయో ఎవరైనా ఊహించగలరు. కానీ 30 ఏళ్ళు ఆల్ ఇండియా సర్వీసు అధికారిగా పనిచేసి బీజేపీ అభ్యర్ధిగా మారిన రత్నప్రభ వ్యవహరం కూడా విచిత్రంగానే ఉంది. తిరుపతి, సత్యవేడులో బీజేపీ+జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నట్లున్నారు.
సమావేశం తర్వాత రత్నప్రభ ఓ ట్వీట్ చేశారు. అందులో తన పిల్లలు, పవన్ కల్యాణ్ అభిమానులతో కలిసి వకీల్ సాబ్ ట్రయల్ చూశారట. తప్పులేదు మనం ఇళ్ళల్లో కూర్చున్నపుడు కూడా టీవీల్లో ట్రయలర్స్ చూస్తునే ఉంటాం. ట్రయలర్ చాలా ఎక్సైటింగ్ గా ఉందట. ‘లుకింగ్ ఫార్వార్డ్ టు సీ ది క్రానికల్స్ ఆఫ్ వకీల్ సాబ్’ అని ట్వీట్ చేశారు. అభ్యర్ధి తాజా ట్వీట్ చూసిన తర్వాత ఆమె పవర్ స్టార్ కు వీరాభిమాని అయిపోయారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఆమె ట్వీట్లు దేనికోసమో అందరికీ తెలిసిందే. తిరుపతి లోక్ సభ పరిధిలో రెండుపార్టీల బలాబలాలు ఏమిటో చాలామందికి తెలుసు. మరి నేతలకు తెలిసిన విషయం అభ్యర్ధికి తెలీదేమో. అందుకనే పవన్ వీరాభిమాని లాగ ఆమె కూడా వకీల్ సాబ్ కోసమని ఓ ట్వీట్ పెట్టేశారు. నిజంగా ఇదంతా పవన్ మీద అభిమానమేనా ? లేకపోతే ఎన్నికల్లో ఓట్ల అభిమానమా ? తొందరలోనే తేలిపోతుంది కదా విషయం ఏమిటో ?
This post was last modified on April 1, 2021 10:55 am
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…