Political News

దీదీపై నీచమైన కామెంట్లు చేసిన బీజేపీ నేత

రాజకీయంగా ఎంతటి శత్రుత్వం అయినా ఉండొచ్చు. అంతమాత్రాన కనీస గౌరవ మర్యాదల్ని అస్సలు విడిచి పెట్టకూడదు. మహిళల విషయంలో బెంగాల్ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఛీప్ గా ఉండటమే కాదు.. కమలనాథుల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు కూడా వస్తాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. బెంగాల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. పోటీ ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం.. మర్యాదల్ని వదిలేసి.. గల్లీ నేతలు సైతం మాట్లాడుకోలేనంత దారుణమైన వ్యాఖ్య చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.

తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తవుతోంది. పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మమత తన విరిగిన కాలిని అందరికి చూపించాలని అనుకుంటున్నారని.. అలాంటప్పుడు ఆమె చీర కట్టుకోవటం ఏందుకు? అని ప్రశ్నించారు.

దానికి కొనసాగింపుగా.. ‘చెడ్డీలు వేసుకుంటే అందరికి స్పష్టంగా కనిపిస్తుంది కదా’ అంటూ చేసిన అమర్యాదకరమైన వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల్నిపలువురు తప్పుపడుతున్నారు. అందరూ ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఒక కాలు కనిపించి మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకుంటున్నారు. నేనెప్పుడూ ఇలా చీర కట్టుకోవటం చూడలేదు. నీ కాళ్లు చూపించాలని అనుకుంటే చీర కట్టుకోవటం ఎందుకు? చెడ్డీలు వేసుకోవచ్చు కదా’ అని దారుణ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ చెడ్డీ వ్యాఖ్యలు దుమారంగా మారనున్నాయి. ఛీ.. ఛీ .. అనిపించేలా ఈ చెడ్డీ వ్యాఖ్యలేంది కమలనాథులు?

This post was last modified on March 25, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

59 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago