రాజకీయంగా ఎంతటి శత్రుత్వం అయినా ఉండొచ్చు. అంతమాత్రాన కనీస గౌరవ మర్యాదల్ని అస్సలు విడిచి పెట్టకూడదు. మహిళల విషయంలో బెంగాల్ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఛీప్ గా ఉండటమే కాదు.. కమలనాథుల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు కూడా వస్తాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. బెంగాల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. పోటీ ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం.. మర్యాదల్ని వదిలేసి.. గల్లీ నేతలు సైతం మాట్లాడుకోలేనంత దారుణమైన వ్యాఖ్య చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తవుతోంది. పురూలియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మమత తన విరిగిన కాలిని అందరికి చూపించాలని అనుకుంటున్నారని.. అలాంటప్పుడు ఆమె చీర కట్టుకోవటం ఏందుకు? అని ప్రశ్నించారు.
దానికి కొనసాగింపుగా.. ‘చెడ్డీలు వేసుకుంటే అందరికి స్పష్టంగా కనిపిస్తుంది కదా’ అంటూ చేసిన అమర్యాదకరమైన వ్యాఖ్య ఇప్పుడు వివాదంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల్నిపలువురు తప్పుపడుతున్నారు. అందరూ ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ‘‘ఒక కాలు కనిపించి మరో కాలు కనిపించకుండా ఆమె చీర కట్టుకుంటున్నారు. నేనెప్పుడూ ఇలా చీర కట్టుకోవటం చూడలేదు. నీ కాళ్లు చూపించాలని అనుకుంటే చీర కట్టుకోవటం ఎందుకు? చెడ్డీలు వేసుకోవచ్చు కదా’ అని దారుణ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ చెడ్డీ వ్యాఖ్యలు దుమారంగా మారనున్నాయి. ఛీ.. ఛీ .. అనిపించేలా ఈ చెడ్డీ వ్యాఖ్యలేంది కమలనాథులు?
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…