రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అందరూ అనుకున్నా.. ఫలితాల్లో మాత్రం ఆ తరహా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అయితే.. ఇంతగా విజయం సాధించినా అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ మా త్రం వైసీపీకి దక్కలేదు. ఇక్కడ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు .. తాజాగా ఆయనే చైర్మన్గా ఏకగ్రీవం అయ్యారు. మొత్తం స్థానాల్లో జేసీ వర్గం 20 వార్డులను దక్కించుకుం ది.
ఇంత వరకు బాగానే ఉంది. రాష్ట్రం మొత్తం వైసీపీ హవా ఉన్నా… తాడిపత్రిని మాత్రం టీడీపీ తన ఖాతాలో వేసుకోవడం.. సంచలనమే. అయితే.. ఈ సంతోషాన్ని కొద్ది సేపు కూడా నిలవకుండా చేసేశారు… జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎప్పుడూ.. సంచలన కామెంట్లు చేసే ఆయన.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ మాదిరిగా నడిచిన నేపథ్యంలో తాను చైర్మన్ అవడం అనేది జగన్ నీతిమంతమైన, నిజాయితీతో కూడిన రాజకీయాల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. అంతేకాదు… తాను త్వరలోనే జగన్తో భేటీ అవుతానని తెలిపారు.
నేను మా నాన్న చచ్చిపోయినా.. నేను ఏడవలేదు. కానీ.. వైఎస్ రాజశేఖరరెడ్డి చచ్చిపోతే.. ఏడ్చాను అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జగన్ ఈ రాష్ట్రానికి బాస్ అని , ఆయన కింద తాను పనిచేస్తున్నానని.. ఇది తనకు గర్వ కారణమని జేసీ ప్రకటించారు.. ఈ వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర సంకటంగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓటమి పరాభవం నుంచి కోలుకోలేదు. పోనీ.. గెలిచాం.. నిలిచాం.. అని భావించిన తాడిపత్రిలో ఇప్పుడు కీలక నేతే చంద్రబాబును పక్కన పెట్టి.. మరీ జగన్ను.. పొగడ్తలతో ముంచెత్తడం నేతలకు చిరాకుగా మారింది. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on March 19, 2021 8:57 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…