విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుకే టీడీపీ నేత అయినా.. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరినీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఆయనను చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో ఇతర నేతలు కూడా ఆయనను కలుపుకొని పోయేందుకు ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. సహా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంటివారు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఆయన ఒంటరయ్యారనే టాక్ ఇటు పార్టీలోను, అటు జనాల్లోనూ వినిపిస్తోంది.
ఇక, ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను కేశినేని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల తరహాలో తనే స్వయంగా రంగంలోకి దిగి.. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్రలు కూడా చేశారు. ఆయన కుమార్తె శ్వేతకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వ్యతిరేకతలు వచ్చినా విజయవాడ మేయర్ పీఠాన్ని ఇప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్కడ గెలుస్తారా? అనేది ప్రధానంగా వెంటాడుతున్న ప్రశ్న. ఇక్కడ కనుక గెలుపు గుర్రం ఎక్కలేక పోతే.. కేశినేని హవా పూర్తిగా సన్నగిల్లుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో అట్టుడుకుతున్న విజయవాడ టీడీపీలో కేశినేని కుమార్తె మేయర్ పీఠం దక్కించుకోలేక పోతే.. ఆయనను పార్టీ నేతలు మరింత దూరం పెడతారు.
ఇక, కేశినేని గెలిస్తే.. విజయవాడలో ఆయన దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. తనకంటూ ఇప్పటికే ఒక వర్గం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న కేశినేని.. రేపు కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం పెరగడంతోపాటు.. ఇతర నేతలను మరింత దూరం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయనపై ఆగ్రహంతో ఉన్న నాయకులు .. కేశినేని వైఖరిని జీర్ణించుకుంటారా? పార్టీలోనే కొనసాగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 14, 2021 10:07 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…