విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుకే టీడీపీ నేత అయినా.. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరినీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఆయనను చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో ఇతర నేతలు కూడా ఆయనను కలుపుకొని పోయేందుకు ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. సహా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంటివారు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే ఆయన ఒంటరయ్యారనే టాక్ ఇటు పార్టీలోను, అటు జనాల్లోనూ వినిపిస్తోంది.
ఇక, ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలను కేశినేని నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల తరహాలో తనే స్వయంగా రంగంలోకి దిగి.. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్రలు కూడా చేశారు. ఆయన కుమార్తె శ్వేతకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వ్యతిరేకతలు వచ్చినా విజయవాడ మేయర్ పీఠాన్ని ఇప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్కడ గెలుస్తారా? అనేది ప్రధానంగా వెంటాడుతున్న ప్రశ్న. ఇక్కడ కనుక గెలుపు గుర్రం ఎక్కలేక పోతే.. కేశినేని హవా పూర్తిగా సన్నగిల్లుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో అట్టుడుకుతున్న విజయవాడ టీడీపీలో కేశినేని కుమార్తె మేయర్ పీఠం దక్కించుకోలేక పోతే.. ఆయనను పార్టీ నేతలు మరింత దూరం పెడతారు.
ఇక, కేశినేని గెలిస్తే.. విజయవాడలో ఆయన దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. తనకంటూ ఇప్పటికే ఒక వర్గం ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న కేశినేని.. రేపు కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం పెరగడంతోపాటు.. ఇతర నేతలను మరింత దూరం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయనపై ఆగ్రహంతో ఉన్న నాయకులు .. కేశినేని వైఖరిని జీర్ణించుకుంటారా? పార్టీలోనే కొనసాగుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 14, 2021 10:07 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…