Political News

ఐదు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది? ప్రముఖ మీడియా సంస్థ పోల్

ఆసక్తికరంగా మారిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీద ప్రభావాన్ని కచ్ఛితంగా చూపించనున్నాయి. భవిష్యత్ రాజకీయాల్ని దిశానిర్దేశం చేసే ఈ ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాల్ని వెల్లడించారు. ఉత్తరాదిన పేరున్న ఆనంద్ బజార్ పత్రిక.. సీ ఓటర్ అనే రెండు సంస్థలు కలిసి ఒపీనియన్ పోల్ నిర్వహించారు. దీని ప్రకారం పశ్చిమబెంగాల్ లో దీదీకి హ్యాట్రిక్ విజయం ఖాయమని తేలుస్తున్నారు. అంతేకాదు తమిళనాడులో స్టాలిన్ కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల పుణ్యమా అని జాతీయ పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ లు పెద్దగా లాభపడేది ఏమీ ఉండదంటున్నారు. కొంతలో కొంత దక్షిణాదిన మరో రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఓపినీయన్ పోల్ లో వ్యక్తమైన విషయాల్ని చూస్తే..

  • పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ 148 నుంచి 164 సీట్లను సాధించి మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి 92 నుంచి 108 సీట్ల వరకు సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. కాంగ్రెస్ -వామపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తప్పదని.. వారికి 31- 39 సీట్లు మాత్రమే వచ్చే వీలుందంటున్నారు.
  • తమిళనాడు విషయానికి వస్తే.. అన్నాడీఎంకేతో జత కట్టిన ఎన్డీయే కూటమికి భారీ దెబ్బ తగలటం ఖాయమని చెబుతున్నారు. డీఎంకే లీడ్ చేసే యూపీఏ కూటమికి అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకొని అధికారంలోకి వస్తుందంటున్నారు. యూపీఏకు 154-162 సీట్ల మధ్యన వస్తే.. అన్నాడీఎంకే కూటమికి 58-62 సీట్లు మాత్రమే వస్తాయనట. కమల్ హాసన్ పార్టీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని తేల్చారు.
  • కేరళలో మరోసారి కమ్యునిస్టులే అధికారాన్ని చేపట్టే వీలుందని చెబుతున్నారు. సీపీఎం లీడ్ చేసే లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 83 నుంచి 91 సీట్లు వచ్చే చాన్స్ ఉందని.. కాంగ్రెస్ లీడ్ చేసే యూడీఎఫ్కు 47-55 సీట్లు వచ్చే వీలుందని చెబుతున్నారకు. బీజేపీకి రెండుస్థానాలకు మించి రావట.
  • అసోంలో మాత్రం అధికార ఎన్డీయే కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. యూపీఏ కూటమికి 47 సీట్లకు పరిమితమయ్యే వీలుంది.
  • ఆసక్తికరంగా పుదుచ్చేరి ఫలితాలు ఉంటాయంటున్నారు. అధికార కాంగ్రెస్ కు బలమైన ఎదురుదెబ్బ తగలనున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 17-21 సీట్లు వచ్చే వీలుందని.. కాంగ్రెస్ కు బలంగా దెబ్బ తగిలే అవకాశమే ఎక్కువట.

This post was last modified on March 2, 2021 12:02 pm

Share
Show comments

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

49 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago