Political News

ఐదు రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది? ప్రముఖ మీడియా సంస్థ పోల్

ఆసక్తికరంగా మారిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల మీద ప్రభావాన్ని కచ్ఛితంగా చూపించనున్నాయి. భవిష్యత్ రాజకీయాల్ని దిశానిర్దేశం చేసే ఈ ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వివరాల్ని వెల్లడించారు. ఉత్తరాదిన పేరున్న ఆనంద్ బజార్ పత్రిక.. సీ ఓటర్ అనే రెండు సంస్థలు కలిసి ఒపీనియన్ పోల్ నిర్వహించారు. దీని ప్రకారం పశ్చిమబెంగాల్ లో దీదీకి హ్యాట్రిక్ విజయం ఖాయమని తేలుస్తున్నారు. అంతేకాదు తమిళనాడులో స్టాలిన్ కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల పుణ్యమా అని జాతీయ పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ లు పెద్దగా లాభపడేది ఏమీ ఉండదంటున్నారు. కొంతలో కొంత దక్షిణాదిన మరో రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఓపినీయన్ పోల్ లో వ్యక్తమైన విషయాల్ని చూస్తే..

  • పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ 148 నుంచి 164 సీట్లను సాధించి మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి 92 నుంచి 108 సీట్ల వరకు సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. కాంగ్రెస్ -వామపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తప్పదని.. వారికి 31- 39 సీట్లు మాత్రమే వచ్చే వీలుందంటున్నారు.
  • తమిళనాడు విషయానికి వస్తే.. అన్నాడీఎంకేతో జత కట్టిన ఎన్డీయే కూటమికి భారీ దెబ్బ తగలటం ఖాయమని చెబుతున్నారు. డీఎంకే లీడ్ చేసే యూపీఏ కూటమికి అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకొని అధికారంలోకి వస్తుందంటున్నారు. యూపీఏకు 154-162 సీట్ల మధ్యన వస్తే.. అన్నాడీఎంకే కూటమికి 58-62 సీట్లు మాత్రమే వస్తాయనట. కమల్ హాసన్ పార్టీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని తేల్చారు.
  • కేరళలో మరోసారి కమ్యునిస్టులే అధికారాన్ని చేపట్టే వీలుందని చెబుతున్నారు. సీపీఎం లీడ్ చేసే లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 83 నుంచి 91 సీట్లు వచ్చే చాన్స్ ఉందని.. కాంగ్రెస్ లీడ్ చేసే యూడీఎఫ్కు 47-55 సీట్లు వచ్చే వీలుందని చెబుతున్నారకు. బీజేపీకి రెండుస్థానాలకు మించి రావట.
  • అసోంలో మాత్రం అధికార ఎన్డీయే కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చారు. యూపీఏ కూటమికి 47 సీట్లకు పరిమితమయ్యే వీలుంది.
  • ఆసక్తికరంగా పుదుచ్చేరి ఫలితాలు ఉంటాయంటున్నారు. అధికార కాంగ్రెస్ కు బలమైన ఎదురుదెబ్బ తగలనున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 17-21 సీట్లు వచ్చే వీలుందని.. కాంగ్రెస్ కు బలంగా దెబ్బ తగిలే అవకాశమే ఎక్కువట.

This post was last modified on March 2, 2021 12:02 pm

Share
Show comments

Recent Posts

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

1 hour ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

1 hour ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

2 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

3 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

4 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

5 hours ago