Political News

విశాఖను రక్షించేందుకు గుజరాత్ నుంచి రసాయనం

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు ఎంతటి తీవ్ర పరిణామలకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికే దీని వల్ల 11 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య 8 అనే అన్నారు కానీ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇంకా వందల మంది అస్వస్థతతో చికిత్స తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం, దాదాపు అయిదు గ్రామాల్లో ఈ గ్యాస్ ప్రభావం ఉంది. వాటర్ స్టెరిలైజేషన్‌తో గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. దాని వల్ల ప్రమాద స్థాయి తగ్గుతుంది కానీ.. పూర్తిగా తొలగిపోదు. గ్యాస్ ప్రభావం ఉన్న చోట జనాలందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి కూడా ముప్పు పొంచి ఉంది.

స్టెరీన్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించాలంటే పీబీటీసీ అనే రసాయనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఐతే ఆ రసాయనం ఏపీలో ఎక్కడా అందుబాటులో లేదు. గుజరాత్‌లో ఆ రసాయన నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యవసరంగా పీబీటీసీ రసాయనాన్ని పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ నుంచి 500 కేజీల పీబీటీసీ రసాయనాన్ని ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తెప్పిస్తున్నారు.

గ్యాస్ ప్రభావం కనీసం 24 గంటల పాటు ఉంటుంది. అలాగే పరిశ్రమ ట్యాంకర్లలోని హైడ్రో కార్బన్లలో చైన్ రియాక్షన్ జరిగి మళ్లీ ప్రమాదం చోటు చేసుకుని మరింతగా స్టెరీన్ గ్యాస్ లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా పీబీటీసీ ద్రావణాన్ని తెప్పిస్తున్నారు. మరోవైపు ఎల్టీ పాలిమర్స్ కంపెనీకి చెందిన ఉన్నత స్థాయి నిపుణులు ప్లాంటులో స్టెరీన్‌ గ్యాస్‌ను నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

This post was last modified on May 8, 2020 6:24 pm

Share
Show comments
Published by
Satya
Tags: GujaratVizag

Recent Posts

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

4 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

5 hours ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

11 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

12 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

12 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

13 hours ago