Political News

విశాఖను రక్షించేందుకు గుజరాత్ నుంచి రసాయనం

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు ఎంతటి తీవ్ర పరిణామలకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికే దీని వల్ల 11 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య 8 అనే అన్నారు కానీ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇంకా వందల మంది అస్వస్థతతో చికిత్స తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం, దాదాపు అయిదు గ్రామాల్లో ఈ గ్యాస్ ప్రభావం ఉంది. వాటర్ స్టెరిలైజేషన్‌తో గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. దాని వల్ల ప్రమాద స్థాయి తగ్గుతుంది కానీ.. పూర్తిగా తొలగిపోదు. గ్యాస్ ప్రభావం ఉన్న చోట జనాలందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్న ప్రభుత్వ సిబ్బందికి కూడా ముప్పు పొంచి ఉంది.

స్టెరీన్ గ్యాస్ ప్రభావాన్ని తగ్గించాలంటే పీబీటీసీ అనే రసాయనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఐతే ఆ రసాయనం ఏపీలో ఎక్కడా అందుబాటులో లేదు. గుజరాత్‌లో ఆ రసాయన నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యవసరంగా పీబీటీసీ రసాయనాన్ని పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ నుంచి 500 కేజీల పీబీటీసీ రసాయనాన్ని ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తెప్పిస్తున్నారు.

గ్యాస్ ప్రభావం కనీసం 24 గంటల పాటు ఉంటుంది. అలాగే పరిశ్రమ ట్యాంకర్లలోని హైడ్రో కార్బన్లలో చైన్ రియాక్షన్ జరిగి మళ్లీ ప్రమాదం చోటు చేసుకుని మరింతగా స్టెరీన్ గ్యాస్ లీకయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా పీబీటీసీ ద్రావణాన్ని తెప్పిస్తున్నారు. మరోవైపు ఎల్టీ పాలిమర్స్ కంపెనీకి చెందిన ఉన్నత స్థాయి నిపుణులు ప్లాంటులో స్టెరీన్‌ గ్యాస్‌ను నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

This post was last modified on May 8, 2020 6:24 pm

Share
Show comments
Published by
Satya
Tags: GujaratVizag

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

37 seconds ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago