ఎల్ జీ ప్రతినిధుల్ని అందరి ముందు కడిగేసిన జగన్?

సంచలనంగా మారిన విశాఖ ఎల్ జీ పాలిమర్స్ విషాద ఉదంతంలో పలు కుటుంబాల్లో తీర్చలేని గుండె కోతను మిగిల్చింది. వేకువజామున లీకైన రసాయన వాయువులతో పదకొండు మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే హుటాహుటిన వైజాగ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం జగన్.

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన వేళలో.. దీనికి కారణమైన కంపెనీ టాప్ లెవల్ ప్రతినిధుల్ని కలిసేందుకు ముఖ్యమంత్రి స్థాయి నేతలు అనుమతివ్వరు. అందుకు భిన్నంగా ఏపీ సీఎం జగన్ వారిని కలిశారు. అయితే.. విమర్శలకు తావివ్వకుండా ఆయన వ్యవహరించిన వైఖరి ఆయనకు మైనస్ గా కాక.. ప్లస్ గా మారింది.

తనను కలిసే ప్రయత్నం చేసిన ఎల్ జీ ప్రతినిదులకు అనుమతిచ్చిన సీఎం జగన్.. కేసీహెచ్ ఆసుపత్రిలో అధికారులు.. వైద్యుల సమక్షంలో వారిని నిలదీయటం.. వారి బాద్యతారాహిత్యాన్ని తీవ్రంగా ప్రశ్నించటం గమనార్హం. స్టెరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించిన ఆయన.. అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేస్తున్నామని స్పష్టం చేయటంతో పాటు.. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కంపెనీకి చెందిన ప్రతినిధుల్ని కలిసే ప్రయత్నం అస్సలు చేయరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు. అందుకు భిన్నంగా అందరి ముందే కడిగేయటం ద్వారా.. తనకున్న కమిట్ మెంట్ ను తేల్చి చెప్పటంతో పాటు.. తన దగ్గర ఎలాంటి రహస్యాలు.. మొహమాటాలు ఉండవన్న సంకేతాల్ని జగన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అందరూ తప్పు చేశారనుకునే ఉదంతాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవటంలో సీఎం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

This post was last modified on May 18, 2020 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago