ఎల్ జీ ప్రతినిధుల్ని అందరి ముందు కడిగేసిన జగన్?

సంచలనంగా మారిన విశాఖ ఎల్ జీ పాలిమర్స్ విషాద ఉదంతంలో పలు కుటుంబాల్లో తీర్చలేని గుండె కోతను మిగిల్చింది. వేకువజామున లీకైన రసాయన వాయువులతో పదకొండు మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే హుటాహుటిన వైజాగ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం జగన్.

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన వేళలో.. దీనికి కారణమైన కంపెనీ టాప్ లెవల్ ప్రతినిధుల్ని కలిసేందుకు ముఖ్యమంత్రి స్థాయి నేతలు అనుమతివ్వరు. అందుకు భిన్నంగా ఏపీ సీఎం జగన్ వారిని కలిశారు. అయితే.. విమర్శలకు తావివ్వకుండా ఆయన వ్యవహరించిన వైఖరి ఆయనకు మైనస్ గా కాక.. ప్లస్ గా మారింది.

తనను కలిసే ప్రయత్నం చేసిన ఎల్ జీ ప్రతినిదులకు అనుమతిచ్చిన సీఎం జగన్.. కేసీహెచ్ ఆసుపత్రిలో అధికారులు.. వైద్యుల సమక్షంలో వారిని నిలదీయటం.. వారి బాద్యతారాహిత్యాన్ని తీవ్రంగా ప్రశ్నించటం గమనార్హం. స్టెరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించిన ఆయన.. అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేస్తున్నామని స్పష్టం చేయటంతో పాటు.. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కంపెనీకి చెందిన ప్రతినిధుల్ని కలిసే ప్రయత్నం అస్సలు చేయరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు. అందుకు భిన్నంగా అందరి ముందే కడిగేయటం ద్వారా.. తనకున్న కమిట్ మెంట్ ను తేల్చి చెప్పటంతో పాటు.. తన దగ్గర ఎలాంటి రహస్యాలు.. మొహమాటాలు ఉండవన్న సంకేతాల్ని జగన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అందరూ తప్పు చేశారనుకునే ఉదంతాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవటంలో సీఎం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

This post was last modified on May 18, 2020 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

34 minutes ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

1 hour ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

1 hour ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

2 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

3 hours ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

3 hours ago