స్టెరీన్ గ్యాస్.. ఈ ఉదయం నుంచి వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరిది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి లీకై.. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసి.. ఎనిమిది మంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్న గ్యాస్ ఇది. దీని కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మరింత మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏంటీ స్టెరీన్ గ్యాస్.. ఇది ఎందుకు లీక్ అయింది.. దీని ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటికి నిపుణులు సమాధానం చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ నెలన్నర పాటు మూతపడి ఉండగా.. రెండు రోజుల కిందటే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో దాన్ని తెరించారు. 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కంపెనీలో.. రోజూ 417 టన్నుల పాలిస్టిరీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఐతే స్టోరీన్ గ్యాస్ను ముడిసరుకుగా ఉపయోగించి ఈ పాలిస్టరీన్ తయారు చేస్తారు.
లాక్ డౌన్ కారణంగా నెలన్నరగా కంపెనీలో పనులు జరగకపోవడంతో స్టెరీన్ గ్యాస్ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగిందని.. ఫ్యాక్టరీని పున:ప్రారంభించడంతో గ్యాస్ లీక్ అయిందని అంటున్నారు. ఈ గ్యాస్ మిగతా గ్యాస్ వాయువులతో పోలిస్తే బరువైంది. దీని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాస్ను పీలిస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మెదడు మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. వెంటనే పడే ప్రభావం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కూడా సమస్యలు తలెత్తవచ్చు.
గురువారం ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో పీల్చిన వారికి శ్వాస అందక అపస్మారక స్థితికి చేరడం, ప్రాణాలు కోల్పోవడం జరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ గ్యాస్ ప్రభావం 3 కిలోమీటర్ల పరిధిలోని ఐదు గ్రామాలపై ఉండగా.. అక్కడి వాళ్లందరినీ ఖాళీ చేయించి.. వాటర్ స్టెరిలైజేషన్ చేయడం ద్వారా గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…