స్టెరీన్ గ్యాస్.. ఈ ఉదయం నుంచి వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరిది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి లీకై.. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసి.. ఎనిమిది మంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్న గ్యాస్ ఇది. దీని కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మరింత మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏంటీ స్టెరీన్ గ్యాస్.. ఇది ఎందుకు లీక్ అయింది.. దీని ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తాయి. వీటికి నిపుణులు సమాధానం చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ నెలన్నర పాటు మూతపడి ఉండగా.. రెండు రోజుల కిందటే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో దాన్ని తెరించారు. 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కంపెనీలో.. రోజూ 417 టన్నుల పాలిస్టిరీన్ ఉత్పత్తి జరుగుతుంది. ఐతే స్టోరీన్ గ్యాస్ను ముడిసరుకుగా ఉపయోగించి ఈ పాలిస్టరీన్ తయారు చేస్తారు.
లాక్ డౌన్ కారణంగా నెలన్నరగా కంపెనీలో పనులు జరగకపోవడంతో స్టెరీన్ గ్యాస్ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగిందని.. ఫ్యాక్టరీని పున:ప్రారంభించడంతో గ్యాస్ లీక్ అయిందని అంటున్నారు. ఈ గ్యాస్ మిగతా గ్యాస్ వాయువులతో పోలిస్తే బరువైంది. దీని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాస్ను పీలిస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మెదడు మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. వెంటనే పడే ప్రభావం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో కూడా సమస్యలు తలెత్తవచ్చు.
గురువారం ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో పీల్చిన వారికి శ్వాస అందక అపస్మారక స్థితికి చేరడం, ప్రాణాలు కోల్పోవడం జరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ గ్యాస్ ప్రభావం 3 కిలోమీటర్ల పరిధిలోని ఐదు గ్రామాలపై ఉండగా.. అక్కడి వాళ్లందరినీ ఖాళీ చేయించి.. వాటర్ స్టెరిలైజేషన్ చేయడం ద్వారా గ్యాస్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
This post was last modified on May 7, 2020 4:43 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…